US: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్.. ఆందోళనలో తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి అదృశమయ్యాడు. హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల అబ్దుల్ మహ్మద్ ఈనెల 9 నుంచి తల్లిదండ్రులతో టచ్లో లేడు. ఎలాంటి ఫోన్ సంభాషణ లేదు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే కిడ్నాపర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము అడిగిన డబ్బు ఇవ్వకుంటే.. కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారని పేరెంట్స్ వాపోయారు. తమ కుమారుడి ఆచూకీ తెలియజేయాలంటూ చికాగోలోని ఇండియన్ కౌన్సిల్కు తల్లిదండ్రులు లేఖ రాశారు.
ఇటీవలే ఆంధ్రాకు చెందిన 20 ఏళ్ల అభిజిత్ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఫారెస్ట్లోని ఓ కారులో అభిజిత్ మృతదేహం లభ్యమైంది. డబ్బు లేదా ల్యాప్టాప్ కోసం దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఏడాది నుంచి భారత సంతతికి చెందిన పలువురు అమెరికాలో మృత్యువాతపడుతున్నారు.
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
తాజాగా అబ్దుల్ మహ్మద్ మిస్సింగ్తో పేరెంట్స్ కలవరపడుతున్నారు. మార్చి 7వ తేదీ నుంచి అబ్దుల్ మహ్మద్ తమతో మాట్లాడలేదని కుటుంబీకులు చెబుతున్నారు. ఓహియోలోని క్లీవ్ల్యాండ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు గత మే నెలలో అబ్దుల్ మహ్మద్ అమెరికా వెళ్లాడు. ఇంతలో అతడు కిడ్నాపర్ల చెరలో చిక్కికున్నాడు.
గత వారం తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహ్మద్ సలీమ్ తెలిపారు. తన కొడుకును క్లీవ్ల్యాండ్లో డ్రగ్స్ ముఠా కిడ్నాప్ చేశారంటూ పేర్కొన్నాడు. డబ్బు ఇవ్వకుంటే.. కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారని సలీమ్ తెలిపాడు. సమాచారం అందగానే అమెరికాలో ఉన్న బంధువులకు సమాచారం అందించారు. అనంతరం వారు క్లీవ్ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహ్మద్ తెల్లటి టీ షర్ట్, ఎరుపు రంగు స్వెటర్, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నాడని ఫిర్యాదులో బంధువులు పేర్కొన్నారు. అలాగే అతడి ఆచూకీ కోసం చికాగోలోని ఇండియన్ కౌన్సిల్కు లేఖ కుటుంబ సభ్యులు లేఖ రాశారు.
అమెరికాలో గత వారమే ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన అభిజిత్ పరుచూరు (20) కారులో శవమై కనిపించాడు. బోస్టన్లోని యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మూడు నెలల వ్యవధిలో అమెరికాలో భారత సంతతికి చెందిన వారు మృతి చెందడం ఇది తొమ్మిదవ ఘటన.
తాజావార్తలు
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..