అమెరికాలో మరో తెలుగు విద్యార్థి అదృశమయ్యాడు. హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల అబ్దుల్ మహ్మద్ ఈనెల 9 నుంచి తల్లిదండ్రులతో టచ్లో లేడు. ఎలాంటి ఫోన్ సంభాషణ లేదు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే కిడ్నాపర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము అడిగిన డబ్బు ఇవ్వకుంటే.. కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారని పేరెంట్స్ వాపోయారు. తమ కుమారుడి ఆచూకీ తెలియజేయాలంటూ చికాగోలోని ఇండియన్ కౌన్సిల్కు తల్లిదండ్రులు లేఖ రాశారు.
ఇటీవలే ఆంధ్రాకు చెందిన 20 ఏళ్ల అభిజిత్ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఫారెస్ట్లోని ఓ కారులో అభిజిత్ మృతదేహం లభ్యమైంది. డబ్బు లేదా ల్యాప్టాప్ కోసం దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఏడాది నుంచి భారత సంతతికి చెందిన పలువురు అమెరికాలో మృత్యువాతపడుతున్నారు.
తాజాగా అబ్దుల్ మహ్మద్ మిస్సింగ్తో పేరెంట్స్ కలవరపడుతున్నారు. మార్చి 7వ తేదీ నుంచి అబ్దుల్ మహ్మద్ తమతో మాట్లాడలేదని కుటుంబీకులు చెబుతున్నారు. ఓహియోలోని క్లీవ్ల్యాండ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు గత మే నెలలో అబ్దుల్ మహ్మద్ అమెరికా వెళ్లాడు. ఇంతలో అతడు కిడ్నాపర్ల చెరలో చిక్కికున్నాడు.
గత వారం తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహ్మద్ సలీమ్ తెలిపారు. తన కొడుకును క్లీవ్ల్యాండ్లో డ్రగ్స్ ముఠా కిడ్నాప్ చేశారంటూ పేర్కొన్నాడు. డబ్బు ఇవ్వకుంటే.. కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారని సలీమ్ తెలిపాడు. సమాచారం అందగానే అమెరికాలో ఉన్న బంధువులకు సమాచారం అందించారు. అనంతరం వారు క్లీవ్ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహ్మద్ తెల్లటి టీ షర్ట్, ఎరుపు రంగు స్వెటర్, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నాడని ఫిర్యాదులో బంధువులు పేర్కొన్నారు. అలాగే అతడి ఆచూకీ కోసం చికాగోలోని ఇండియన్ కౌన్సిల్కు లేఖ కుటుంబ సభ్యులు లేఖ రాశారు.
అమెరికాలో గత వారమే ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన అభిజిత్ పరుచూరు (20) కారులో శవమై కనిపించాడు. బోస్టన్లోని యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మూడు నెలల వ్యవధిలో అమెరికాలో భారత సంతతికి చెందిన వారు మృతి చెందడం ఇది తొమ్మిదవ ఘటన.