Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story The Parents Of An Indian Student Studying In The Us Have Received A Ransom Call

US: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్.. ఆందోళనలో తల్లిదండ్రులు

NTV Telugu Twitter
Published Date :March 20, 2024 , 4:02 pm
By Suresh Maddala
US: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్.. ఆందోళనలో తల్లిదండ్రులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి అదృశమయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల అబ్దుల్ మహ్మద్ ఈనెల 9 నుంచి తల్లిదండ్రులతో టచ్‌లో లేడు. ఎలాంటి ఫోన్ సంభాషణ లేదు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే కిడ్నాపర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము అడిగిన డబ్బు ఇవ్వకుంటే.. కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారని పేరెంట్స్ వాపోయారు. తమ కుమారుడి ఆచూకీ తెలియజేయాలంటూ చికాగోలోని ఇండియన్ కౌన్సిల్‌కు తల్లిదండ్రులు లేఖ రాశారు.

ఇటీవలే ఆంధ్రాకు చెందిన 20 ఏళ్ల అభిజిత్ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఫారెస్ట్‌లోని ఓ కారులో అభిజిత్ మృతదేహం లభ్యమైంది. డబ్బు లేదా ల్యాప్‌టాప్ కోసం దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఏడాది నుంచి భారత సంతతికి చెందిన పలువురు అమెరికాలో మృత్యువాతపడుతున్నారు.

తాజాగా అబ్దుల్ మహ్మద్ మిస్సింగ్‌తో పేరెంట్స్ కలవరపడుతున్నారు. మార్చి 7వ తేదీ నుంచి అబ్దుల్ మహ్మద్ తమతో మాట్లాడలేదని కుటుంబీకులు చెబుతున్నారు. ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు గత మే నెలలో అబ్దుల్ మహ్మద్ అమెరికా వెళ్లాడు. ఇంతలో అతడు కిడ్నాపర్ల చెరలో చిక్కికున్నాడు.

గత వారం తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహ్మద్ సలీమ్‌ తెలిపారు. తన కొడుకును క్లీవ్‌ల్యాండ్‌లో డ్రగ్స్ ముఠా కిడ్నాప్ చేశారంటూ పేర్కొన్నాడు. డబ్బు ఇవ్వకుంటే.. కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారని సలీమ్ తెలిపాడు. సమాచారం అందగానే అమెరికాలో ఉన్న బంధువులకు సమాచారం అందించారు. అనంతరం వారు క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహ్మద్ తెల్లటి టీ షర్ట్, ఎరుపు రంగు స్వెటర్, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నాడని ఫిర్యాదులో బంధువులు పేర్కొన్నారు. అలాగే అతడి ఆచూకీ కోసం చికాగోలోని ఇండియన్ కౌన్సిల్‌కు లేఖ కుటుంబ సభ్యులు లేఖ రాశారు.

అమెరికాలో గత వారమే ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన అభిజిత్ పరుచూరు (20) కారులో శవమై కనిపించాడు. బోస్టన్‌లోని యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మూడు నెలల వ్యవధిలో అమెరికాలో భారత సంతతికి చెందిన వారు మృతి చెందడం ఇది తొమ్మిదవ ఘటన.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1200 ransom call
  • hyderabad
  • indian student
  • Missing
  • US parents

తాజావార్తలు

  • Train Accident: రైల్లో నుంచి జారిపడి ఐదుగురు మృతి

  • Mudragada Padmanabha Reddy: మీ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.. బహిరంగ లేఖ విడుదల చేసిన ముద్రగడ..!

  • Jyothika : ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో జ్యోతిక..

  • Stock Market: లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు..

  • Ind vs Pak Water Emergency: పాక్‌కు నీటి కష్టాలు.. భారత్ దెబ్బకి ఎండిపోతున్న పంటలు

ట్రెండింగ్‌

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • 2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

  • Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

  • REDMAGIC Tablet 3 Pro: 8200mAh బ్యాటరీ, గేమింగ్‌కి హై స్పీడ్ గ్యారంటీతో రాబోతున్న REDMAGIC టాబ్లెట్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions