NTV Telugu Site icon

Inspector vs Women: మహిళను చెంపదెబ్బ కొట్టిన ఇన్స్పెక్టర్.. గన్ చూపిస్తూ మరీ..!

Up

Up

యూపీ పోలీసుల ఓ సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఒక మహిళను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. అంతేకాకుండా.. తన వద్ద ఉన్న పిస్టల్ తీసి భయపెట్టాడు. కాగా.. ఈ వీడియో వైరల్ కావడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి దర్యాప్తుకు ఆదేశించారు.

Read Also: Wayanad landslides: ముగిసిన సహాయ చర్యలు.. ఆర్మీకి ఘనంగా వీడ్కోలు

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జరిగింది. సాదా యూనిఫాంలో ఉన్న ఎస్సై కారులో వెళ్తుండగా.. ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్‌కు డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. ఘటన సమయంలో ఆటోలో కూర్చున్న మహిళ నిరసన వ్యక్తం చేయడంతో.. ఇన్‌స్పెక్టర్ తన పిస్టల్‌ను తీసి కారులోంచి బయటకు వచ్చాడు. కోపంతో ఆ మహిళను దుర్భాషలాడుతూ పలుమార్లు చెప్పుతో కొట్టాడు. అలాగే పిస్టల్ తీసి భయపెట్టాడు. ఇది చూసిన పలువురు అక్కడ గుమిగూడారు. ఇన్ స్పెక్టర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైపై తగిన చర్యలు తీసుకోవాలంటూ మండిపడ్డారు.

Read Also: CM Chandrababu: సామాన్య కార్యకర్తలను మరువని చంద్రబాబు.. ప్రత్యేకంగా పిలిచి మరి..!

కాగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై తక్షణమే చర్యలు చేపట్టినట్లు హాపూర్ ఏఎస్పీ వినీత్ భట్నాగర్ తెలిపారు. నిందితుడు ఇన్‌స్పెక్టర్ షేర్ సింగ్‌ను సస్పెండ్ చేశామన్నారు. ఈ విషయంపై అతనిపై విచారణ చేపట్టామని తెలిపారు. మూడు రోజుల క్రితం బులంద్‌షహర్ పోలీసుల వీడియో కూడా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. పోలీసులు తమ బైక్‌లోని పిస్టల్‌ను తీసి యువకుల కారులో పెట్టారు. అందులో పిస్టల్ దొరికిందని చెప్పి.. దానిని స్వాధీనం చేసుకుని అమాయక యువకులను జైలుకు పంపారు. అయితే.. వైరల్ వీడియో ద్వారా నిజానిజాలు బయటపడ్డాయి. దీంతో.. పోలీసులు పరువు తీయడంతో.. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసులను సస్పెండ్ చేశారు.