Manish Sisodia: అలా చేస్తే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారు..
- నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి..
- ప్రతిపక్ష నేతలు ఏకమైతే 24 గంటల్లో కేజ్రీవాల్ బయటకు..
- బీజేపీ నాయకులు రాజ్యాంగం కన్నా ఎక్కువకారు..
- ఆప్ కార్యకర్తలతో మనీష్ సిసోడియా వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ కేసులో 17 నెలలుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియా నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశంలో ‘నియంతృత్వ పాలన’కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పోరాడాలని ఆయన పిలునిచ్చారు. బీజేపీని టార్గెట్ చేస్తూ, ఈ వ్యక్తులు రాజ్యాంగం కన్నా శక్తివంతులు కారని అన్నారు. నాయకులను జైలులో పెట్టడమే కాకుండా ప్రజల్ని వేధించే ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతీ వ్యక్తి పోరాడాలని అన్నారు.
జైల్లో ఉన్నప్పుడు తనకు బెయిల్ ఎప్పుడు వస్తుందనే ఆలోచన లేదని, అయితే బీజేపీకి డబ్బులు విరాళంగా ఇవ్వనందకు వ్యాపారవేత్తలపై ఫేక్ కేసులు పెట్టి జైలులో పెట్టడం చూస్తుంటే బాధగా ఉందని చెప్పారు. ఈ కేసులో జైలులో ఉన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలంతా ఒక్కటైతే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారని అన్నారు.
Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
- Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
- Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Delimitation bill: ఇండియా కూటమికి షాక్.. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
Read Also: Committee Kurrollu: తొలి రోజే దుమ్ము రేపిన ‘కమిటీ కుర్రోళ్ళు’.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారంటే?
సిసోడియా మాట్లాడుతూ.. మేము రథానికి గుర్రాలమే, కానీ మా నిజమైన సారథి జైలులో ఉన్నారని త్వరలోనే బయటకు వస్తారని అన్నారు. తన బెయిల్ తీర్పుపై మాట్లాడుతూ నియంతృత్వాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగం యొక్క అధికారాన్ని ఉపయోగించిందని చెప్పారు. 7-8 నెలల్లోనే తనకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ 17 నెలలు పట్టిందని చెప్పారు. కానీ చివరకు నిజం గెలించిదని అన్నారు. వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ అనర్హత గురించి నేరుగా ప్రస్తావించకుండా, ఆమె తన నాయకుడికి ఎదురుతిరిగింది, ఒలింపిక్స్లో ఏం జరిగిందో చూశారు కదా అని కార్యకర్తలతో ఆయన అన్నారు. మహిళల 50 కేజీల ఫైనల్కు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేష్ ఫోగట్పై పారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
-
Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
-
AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
-
Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!