Manish Sisodia: అలా చేస్తే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారు..
- నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి..
- ప్రతిపక్ష నేతలు ఏకమైతే 24 గంటల్లో కేజ్రీవాల్ బయటకు..
- బీజేపీ నాయకులు రాజ్యాంగం కన్నా ఎక్కువకారు..
- ఆప్ కార్యకర్తలతో మనీష్ సిసోడియా వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ కేసులో 17 నెలలుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియా నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశంలో ‘నియంతృత్వ పాలన’కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పోరాడాలని ఆయన పిలునిచ్చారు. బీజేపీని టార్గెట్ చేస్తూ, ఈ వ్యక్తులు రాజ్యాంగం కన్నా శక్తివంతులు కారని అన్నారు. నాయకులను జైలులో పెట్టడమే కాకుండా ప్రజల్ని వేధించే ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతీ వ్యక్తి పోరాడాలని అన్నారు.
జైల్లో ఉన్నప్పుడు తనకు బెయిల్ ఎప్పుడు వస్తుందనే ఆలోచన లేదని, అయితే బీజేపీకి డబ్బులు విరాళంగా ఇవ్వనందకు వ్యాపారవేత్తలపై ఫేక్ కేసులు పెట్టి జైలులో పెట్టడం చూస్తుంటే బాధగా ఉందని చెప్పారు. ఈ కేసులో జైలులో ఉన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలంతా ఒక్కటైతే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారని అన్నారు.
Also Read
- Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
Read Also: Committee Kurrollu: తొలి రోజే దుమ్ము రేపిన ‘కమిటీ కుర్రోళ్ళు’.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారంటే?
సిసోడియా మాట్లాడుతూ.. మేము రథానికి గుర్రాలమే, కానీ మా నిజమైన సారథి జైలులో ఉన్నారని త్వరలోనే బయటకు వస్తారని అన్నారు. తన బెయిల్ తీర్పుపై మాట్లాడుతూ నియంతృత్వాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగం యొక్క అధికారాన్ని ఉపయోగించిందని చెప్పారు. 7-8 నెలల్లోనే తనకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ 17 నెలలు పట్టిందని చెప్పారు. కానీ చివరకు నిజం గెలించిదని అన్నారు. వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ అనర్హత గురించి నేరుగా ప్రస్తావించకుండా, ఆమె తన నాయకుడికి ఎదురుతిరిగింది, ఒలింపిక్స్లో ఏం జరిగిందో చూశారు కదా అని కార్యకర్తలతో ఆయన అన్నారు. మహిళల 50 కేజీల ఫైనల్కు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేష్ ఫోగట్పై పారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
-
Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
-
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!