Atrocious: మద్యం మత్తులో భార్యపై భర్త దాడి.. సాయం చేసిన అన్నదమ్ములు
- యూపీలోని ఫిరోజాబాద్లో దారుణం
- మద్యం మత్తులో భార్యను కట్టేసి కొట్టిన భర్త
- అన్నకు సాయం చేసేందుకు తమ్ముళ్లు సహకారం
- తీవ్రంగా మహిళను కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.
యూపీలోని ఫిరోజాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో భర్త భార్యను తాళ్లతో కట్టేసి కొట్టాడు. అంతేకాకుండా.. ఆపాల్సింది పోయి అన్నకు సాయం చేసేందుకు తమ్ముళ్లు సహకారం అందించారు. తీవ్రంగా ఆ మహిళను కొట్టడంతో చనిపోయింది. మహిళ మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించగా.. పోస్టుమార్టం నివేదికలో మహిళపై జరిగిన దారుణం బయటపడింది. పోస్టుమార్టంలో మహిళ పేగు దగ్గర ఎనిమిది అంగుళాల పైప్ లభ్యమైంది. రిపోర్టు చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
Read Also: Pushpa 2: గళ్ళ లుంగీ.. గన్ విత్ గొడ్డలితో ఫహాద్
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ఈ ఘటన మత్సేనా ప్రాంతంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త.. భార్య నిరసన వ్యక్తం చేయడంతో అతడు ఆమెను కొట్టడం ప్రారంభించాడు. భర్త మొదట భార్య కాళ్లకు తాడుతో కట్టాడు. ఆ తర్వాత అతని నోరు మూశారు. దీంతో భర్త భార్యను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. ఈ సమయంలో భర్త తన ఇద్దరు సోదరులు కూడా హెల్ప్ చేశారు. ఆ మహిళను వేధించడంలో అన్నదమ్ములు కూడా దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిది అంగుళాల సిలిండర్ను మహిళ శరీరంలోకి చొప్పించడంతో ఆ మహిళ చిత్రహింసలకు గురైంది. ఆ మహిళ నొప్పితో అరుస్తూనే ఉండటంతో.. శబ్దం విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత.. రక్తస్రావం అయిన మహిళను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తతో పాటు అన్నదమ్ములిద్దరినీ అరెస్ట్ చేశారు.
Read Also: Bengaluru video: ఈ కానిస్టేబుల్కు సెల్యూట్ కొట్టాల్సిందే.. ప్రాణాలకు తెగించి డేరింగ్ అరెస్ట్
మరోవైపు.. ఇటావాలోని షేక్పూర్ తలైయాకు చెందిన 30 ఏళ్ల రేష్మ అనే మహిళకు ఫిరోజాబాద్ జిల్లా మత్సేనా అకల్పూర్లో నివాసం ఉంటున్న సుర్జీత్తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. మహిళకు ముగ్గురు పిల్లలు. పెళ్లి అయినప్పటి నుంచి అత్తమామలు తనను వేధిస్తున్నారని మహిళ సోదరుడు అవధేష్ పోలీసులకు తెలిపాడు. చిన్న చిన్న విషయాలకే తన సోదరిని కొట్టేవారని.. సోమవారం రాత్రి ఆమె చేతులు, కాళ్లు కట్టేసి అన్నదమ్ములు ముగ్గురూ కలిసి తన చెల్లెలిని కొట్టి చంపారని మృతురాలి సోదరుడు తెలిపాడు.
తాజావార్తలు
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!