Atrocious: మద్యం మత్తులో భార్యపై భర్త దాడి.. సాయం చేసిన అన్నదమ్ములు
- యూపీలోని ఫిరోజాబాద్లో దారుణం
- మద్యం మత్తులో భార్యను కట్టేసి కొట్టిన భర్త
- అన్నకు సాయం చేసేందుకు తమ్ముళ్లు సహకారం
- తీవ్రంగా మహిళను కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఫిరోజాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో భర్త భార్యను తాళ్లతో కట్టేసి కొట్టాడు. అంతేకాకుండా.. ఆపాల్సింది పోయి అన్నకు సాయం చేసేందుకు తమ్ముళ్లు సహకారం అందించారు. తీవ్రంగా ఆ మహిళను కొట్టడంతో చనిపోయింది. మహిళ మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించగా.. పోస్టుమార్టం నివేదికలో మహిళపై జరిగిన దారుణం బయటపడింది. పోస్టుమార్టంలో మహిళ పేగు దగ్గర ఎనిమిది అంగుళాల పైప్ లభ్యమైంది. రిపోర్టు చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
Read Also: Pushpa 2: గళ్ళ లుంగీ.. గన్ విత్ గొడ్డలితో ఫహాద్
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
ఈ ఘటన మత్సేనా ప్రాంతంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త.. భార్య నిరసన వ్యక్తం చేయడంతో అతడు ఆమెను కొట్టడం ప్రారంభించాడు. భర్త మొదట భార్య కాళ్లకు తాడుతో కట్టాడు. ఆ తర్వాత అతని నోరు మూశారు. దీంతో భర్త భార్యను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. ఈ సమయంలో భర్త తన ఇద్దరు సోదరులు కూడా హెల్ప్ చేశారు. ఆ మహిళను వేధించడంలో అన్నదమ్ములు కూడా దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిది అంగుళాల సిలిండర్ను మహిళ శరీరంలోకి చొప్పించడంతో ఆ మహిళ చిత్రహింసలకు గురైంది. ఆ మహిళ నొప్పితో అరుస్తూనే ఉండటంతో.. శబ్దం విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత.. రక్తస్రావం అయిన మహిళను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తతో పాటు అన్నదమ్ములిద్దరినీ అరెస్ట్ చేశారు.
Read Also: Bengaluru video: ఈ కానిస్టేబుల్కు సెల్యూట్ కొట్టాల్సిందే.. ప్రాణాలకు తెగించి డేరింగ్ అరెస్ట్
మరోవైపు.. ఇటావాలోని షేక్పూర్ తలైయాకు చెందిన 30 ఏళ్ల రేష్మ అనే మహిళకు ఫిరోజాబాద్ జిల్లా మత్సేనా అకల్పూర్లో నివాసం ఉంటున్న సుర్జీత్తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. మహిళకు ముగ్గురు పిల్లలు. పెళ్లి అయినప్పటి నుంచి అత్తమామలు తనను వేధిస్తున్నారని మహిళ సోదరుడు అవధేష్ పోలీసులకు తెలిపాడు. చిన్న చిన్న విషయాలకే తన సోదరిని కొట్టేవారని.. సోమవారం రాత్రి ఆమె చేతులు, కాళ్లు కట్టేసి అన్నదమ్ములు ముగ్గురూ కలిసి తన చెల్లెలిని కొట్టి చంపారని మృతురాలి సోదరుడు తెలిపాడు.
తాజావార్తలు
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?