Pune: అత్యాచార ఆరోపణ, జైలు జీవితం.. అవమానంతో కుటుంబం ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune: పూణెలో ఓ కుటుంబం మృతి చెందిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. కొల్హాపూర్లో పారిశ్రామికవేత్త కుటుంబం ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలతో పారిశ్రామికవేత్త చాలా ఒత్తిడికి గురయ్యాడు. ఈ టెన్షన్తో కుటుంబసభ్యులతో కలిసి ఓ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఉదయం నిద్ర లేపేందుకు తల్లి వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ కుటుంబం విషం సేవించి తమ జీవితాలను ముగించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో గాధింగ్లాజ్ నగరంలో సంచలనం నెలకొంది. మరణించిన పారిశ్రామికవేత్త పేరు సంతోష్ షిండే. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Health tips: ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? పొరపాటున కూడా వీటిని తినకండి..!
Also Read
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
వివరాల్లోకి వెళితే.. గాధింగ్లాజ్ నగరానికి చెందిన పారిశ్రామికవేత్త సంతోష్ షిండేపై కొద్ది రోజుల క్రితం అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఈ అభియోగం కారణంగా దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు ప్రతిదీ మరచిపోయి మళ్లీ ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఘటన ఇంకా మనసులో మెదులుతుండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. మామూలుగా నిద్ర లేచే సమయమే అయినా షిండే లేవలేదు. దీంతో అతని తల్లి తలుపు తట్టేందుకు వెళ్లింది. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. అప్పుడు అతని తల్లి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. ఇరుగుపొరుగు వారు తలుపులు పగులగొట్టి లోపలికి చూడగా బెడ్రూమ్లో షిండే, అతని భార్య, కొడుకు మృతదేహాలు కనిపించాయి. ఆ ముగ్గురి మెడపై గాయాలు కనిపించాయి.
Read Also:Minister RK Roja: హాయ్ ఏపీ.. బైబై బీపీ ( బాబు, పవన్) ప్రజల నినాదం..!
ఇరుగుపొరుగు వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారంతా విషం తాగి మెడకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలియనున్నాయి.
తాజావార్తలు
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!