Pune: అత్యాచార ఆరోపణ, జైలు జీవితం.. అవమానంతో కుటుంబం ఆత్మహత్య
Pune: పూణెలో ఓ కుటుంబం మృతి చెందిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. కొల్హాపూర్లో పారిశ్రామికవేత్త కుటుంబం ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలతో పారిశ్రామికవేత్త చాలా ఒత్తిడికి గురయ్యాడు. ఈ టెన్షన్తో కుటుంబసభ్యులతో కలిసి ఓ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఉదయం నిద్ర లేపేందుకు తల్లి వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ కుటుంబం విషం సేవించి తమ జీవితాలను ముగించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో గాధింగ్లాజ్ నగరంలో సంచలనం నెలకొంది. మరణించిన పారిశ్రామికవేత్త పేరు సంతోష్ షిండే. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Health tips: ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? పొరపాటున కూడా వీటిని తినకండి..!
Also Read
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్..
- KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
వివరాల్లోకి వెళితే.. గాధింగ్లాజ్ నగరానికి చెందిన పారిశ్రామికవేత్త సంతోష్ షిండేపై కొద్ది రోజుల క్రితం అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఈ అభియోగం కారణంగా దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు ప్రతిదీ మరచిపోయి మళ్లీ ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఘటన ఇంకా మనసులో మెదులుతుండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. మామూలుగా నిద్ర లేచే సమయమే అయినా షిండే లేవలేదు. దీంతో అతని తల్లి తలుపు తట్టేందుకు వెళ్లింది. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. అప్పుడు అతని తల్లి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. ఇరుగుపొరుగు వారు తలుపులు పగులగొట్టి లోపలికి చూడగా బెడ్రూమ్లో షిండే, అతని భార్య, కొడుకు మృతదేహాలు కనిపించాయి. ఆ ముగ్గురి మెడపై గాయాలు కనిపించాయి.
Read Also:Minister RK Roja: హాయ్ ఏపీ.. బైబై బీపీ ( బాబు, పవన్) ప్రజల నినాదం..!
ఇరుగుపొరుగు వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారంతా విషం తాగి మెడకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలియనున్నాయి.
తాజావార్తలు
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
-
DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
-
Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
-
Beetroot Stains : బీట్రూట్ మరకలకు బై బై..! ఈ మ్యాజిక్ ట్రిక్ తెలుసా.?
-
AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి…
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!