Pune: అత్యాచార ఆరోపణ, జైలు జీవితం.. అవమానంతో కుటుంబం ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune: పూణెలో ఓ కుటుంబం మృతి చెందిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. కొల్హాపూర్లో పారిశ్రామికవేత్త కుటుంబం ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలతో పారిశ్రామికవేత్త చాలా ఒత్తిడికి గురయ్యాడు. ఈ టెన్షన్తో కుటుంబసభ్యులతో కలిసి ఓ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఉదయం నిద్ర లేపేందుకు తల్లి వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ కుటుంబం విషం సేవించి తమ జీవితాలను ముగించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో గాధింగ్లాజ్ నగరంలో సంచలనం నెలకొంది. మరణించిన పారిశ్రామికవేత్త పేరు సంతోష్ షిండే. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Health tips: ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? పొరపాటున కూడా వీటిని తినకండి..!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
వివరాల్లోకి వెళితే.. గాధింగ్లాజ్ నగరానికి చెందిన పారిశ్రామికవేత్త సంతోష్ షిండేపై కొద్ది రోజుల క్రితం అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఈ అభియోగం కారణంగా దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు ప్రతిదీ మరచిపోయి మళ్లీ ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఘటన ఇంకా మనసులో మెదులుతుండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. మామూలుగా నిద్ర లేచే సమయమే అయినా షిండే లేవలేదు. దీంతో అతని తల్లి తలుపు తట్టేందుకు వెళ్లింది. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. అప్పుడు అతని తల్లి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. ఇరుగుపొరుగు వారు తలుపులు పగులగొట్టి లోపలికి చూడగా బెడ్రూమ్లో షిండే, అతని భార్య, కొడుకు మృతదేహాలు కనిపించాయి. ఆ ముగ్గురి మెడపై గాయాలు కనిపించాయి.
Read Also:Minister RK Roja: హాయ్ ఏపీ.. బైబై బీపీ ( బాబు, పవన్) ప్రజల నినాదం..!
ఇరుగుపొరుగు వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారంతా విషం తాగి మెడకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలియనున్నాయి.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!