Titan Submersible: టైటాన్ అన్వేషణ విషాదాంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titan Submersible: టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు 5 మందితో వెళ్లిన టైటాన్ కథ విషాదాంతంగా ముగిసింది. తీవ్రమైన పీడనం పెరగడంతో మినీ జలాంతర్గామి టైటాన్ పేలి పోయింది. అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్ వెహికిల్ సాయంతో టైటాన్ శకలాలను గుర్తించినట్టు పేర్కొంది. సముద్రగర్భంలో 3,800 మీటర్లు (12,400 అడుగులు) ఉన్న టైటానిక్ అవశేషాల సమీపంలోనే సబ్మెర్సిబుల్ శిధిలాలను కనుగొన్నట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ గురువారం తెలిపింది. తప్పిపోయిన సబ్మెర్సిబుల్లో ఉన్న సిబ్బంది అంతా మరణించినట్లు US కోస్ట్ గార్డ్ ప్రకటించింది.
Read also: YouTube Down: యూట్యూబ్ డౌన్.. వేలాది మందికి నిలిచిన సేవలు..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
అట్లాంటిక్ మహాసముద్రంలోని 12వేల అడుగుల లోతులోని టైటానిక్ శకలాలను చూసేందుకు ముగ్గురు పర్యాటకులు, ఇద్దరు సిబ్బందితో మినీ జలాంతర్గామి టైటాన్ ఆదివారం న్యూఫౌండ్ల్యాండ్ నుంచి బయలుదేరింది. టైటాన్లో పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్(48) ఆయన కుమారుడు సులేమాన్(19), యుఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్తోపాటు ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ, యాత్ర నిర్వహకుడు ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ మినీ జలాంతర్గామిలో ప్రయాణించారు. టైటానిక్ శిథిలాల పర్యటనలో అట్లాంటిక్ మహాసముద్రంలో అదృశ్యమైన కొద్దిసేపటికే అండర్వాటర్ సౌండ్ మానిటరింగ్ పరికరాలపై టైటాన్ సబ్మెర్సిబుల్ పేలినట్లు యుఎస్ నేవీ గుర్తించినట్లు అమెరికాలోని ఒక పత్రిక ప్రకటించింది. పేరుచెప్పడానికి ఇష్టపడని US నేవీ అధికారిని ఉటంకిస్తూ, జలాంతర్గాములను గుర్తించేందుకు రూపొందించిన రహస్య శబ్ద పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా ఆదివారం టైటాన్ తప్పిపోయిన కొద్దిసేపటికే పేలుడు సంభవించిందని పత్రిక పేర్కొంది. యుఎస్ నావికాదళం శబ్ద డేటా యొక్క విశ్లేషణను నిర్వహించిందని మరియు కమ్యూనికేషన్లు కోల్పోయినప్పుడు టైటాన్ సబ్మెర్సిబుల్ పనిచేసే సాధారణ పరిసరాల్లో పేలుడు లేదా పేలుడుకు అనుగుణంగా ఉండే అసాధారణతను గుర్తించినట్టు ఒక అధికారి చెప్పారు.
Read also: Pawan Kalyan : బోయపాటి సినిమాను వదులుకున్న పవన్.. కారణం అదేనా..?
నాలుగు రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించారు. గురువారం సాయంత్రం రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్(ఆర్వోవి) సహాయంతో టైటానిక్ షిప్కు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్టు అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదల చేసింది. అనంతరం అధికారులు విలేఖరులతో మాట్లాడుతూ సముద్రపు అడుగుభాగంలో కనుగొనబడిన శిధిలాలు సబ్ ప్రెజర్ ఛాంబర్ పేలుడుకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. సబ్మెర్సిబుల్లోని ఐదుగురు ప్రయాణికులు మరణించినట్టు ప్రకటించారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!