Titan Submersible: టైటాన్ అన్వేషణ విషాదాంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titan Submersible: టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు 5 మందితో వెళ్లిన టైటాన్ కథ విషాదాంతంగా ముగిసింది. తీవ్రమైన పీడనం పెరగడంతో మినీ జలాంతర్గామి టైటాన్ పేలి పోయింది. అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్ వెహికిల్ సాయంతో టైటాన్ శకలాలను గుర్తించినట్టు పేర్కొంది. సముద్రగర్భంలో 3,800 మీటర్లు (12,400 అడుగులు) ఉన్న టైటానిక్ అవశేషాల సమీపంలోనే సబ్మెర్సిబుల్ శిధిలాలను కనుగొన్నట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ గురువారం తెలిపింది. తప్పిపోయిన సబ్మెర్సిబుల్లో ఉన్న సిబ్బంది అంతా మరణించినట్లు US కోస్ట్ గార్డ్ ప్రకటించింది.
Read also: YouTube Down: యూట్యూబ్ డౌన్.. వేలాది మందికి నిలిచిన సేవలు..
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
అట్లాంటిక్ మహాసముద్రంలోని 12వేల అడుగుల లోతులోని టైటానిక్ శకలాలను చూసేందుకు ముగ్గురు పర్యాటకులు, ఇద్దరు సిబ్బందితో మినీ జలాంతర్గామి టైటాన్ ఆదివారం న్యూఫౌండ్ల్యాండ్ నుంచి బయలుదేరింది. టైటాన్లో పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్(48) ఆయన కుమారుడు సులేమాన్(19), యుఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్తోపాటు ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ, యాత్ర నిర్వహకుడు ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ మినీ జలాంతర్గామిలో ప్రయాణించారు. టైటానిక్ శిథిలాల పర్యటనలో అట్లాంటిక్ మహాసముద్రంలో అదృశ్యమైన కొద్దిసేపటికే అండర్వాటర్ సౌండ్ మానిటరింగ్ పరికరాలపై టైటాన్ సబ్మెర్సిబుల్ పేలినట్లు యుఎస్ నేవీ గుర్తించినట్లు అమెరికాలోని ఒక పత్రిక ప్రకటించింది. పేరుచెప్పడానికి ఇష్టపడని US నేవీ అధికారిని ఉటంకిస్తూ, జలాంతర్గాములను గుర్తించేందుకు రూపొందించిన రహస్య శబ్ద పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా ఆదివారం టైటాన్ తప్పిపోయిన కొద్దిసేపటికే పేలుడు సంభవించిందని పత్రిక పేర్కొంది. యుఎస్ నావికాదళం శబ్ద డేటా యొక్క విశ్లేషణను నిర్వహించిందని మరియు కమ్యూనికేషన్లు కోల్పోయినప్పుడు టైటాన్ సబ్మెర్సిబుల్ పనిచేసే సాధారణ పరిసరాల్లో పేలుడు లేదా పేలుడుకు అనుగుణంగా ఉండే అసాధారణతను గుర్తించినట్టు ఒక అధికారి చెప్పారు.
Read also: Pawan Kalyan : బోయపాటి సినిమాను వదులుకున్న పవన్.. కారణం అదేనా..?
నాలుగు రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించారు. గురువారం సాయంత్రం రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్(ఆర్వోవి) సహాయంతో టైటానిక్ షిప్కు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్టు అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదల చేసింది. అనంతరం అధికారులు విలేఖరులతో మాట్లాడుతూ సముద్రపు అడుగుభాగంలో కనుగొనబడిన శిధిలాలు సబ్ ప్రెజర్ ఛాంబర్ పేలుడుకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. సబ్మెర్సిబుల్లోని ఐదుగురు ప్రయాణికులు మరణించినట్టు ప్రకటించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!