Train Accident: వీడిన దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం మిస్టరీ..కారణం ఇదే..
- చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు
- ప్రమాదానికి మందు పెద్ద పేలుడు శబ్ధం వినిపించిందన్న లోకోపైలెట్
- రైలు ట్రాక్లో లోపం కారణంగా ప్రమాదం
- 2:30 గంటలకు స్టేషన్ మాస్టర్కు విషయం తెలిసింది
- ఈ రైలు మధ్యాహ్నం 2:28 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు
- రెండు నిమిషాల నిర్లక్ష్యం ఇంత పెద్ద ప్రమాదానికి కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి కుట్ర లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే ప్రమాదం అనంతరం లోకో పైలట్కు సంచలన విషయం వెల్లడించారు. ప్రమాదానికి మందు పెద్ద పేలుడు శబ్ధం వినిపించిందని తెలిపారు. దీంతో ప్రమాద ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ పేలుడు శబ్ధం వెనుక మిస్టరీ వెలుగులోకి వచ్చింది. ట్రాక్ నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇంజినీరింగ్ విభాగాన్ని హెచ్చరించినట్లు ఉమ్మడి నివేదికలో చెప్పబడింది. అధికారుల రెండు నిమిషాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది. రెండు నిమిషాలు నలుగురి ప్రాణాలను, మరెంతో మందిని క్షతగాత్రులను చేశాయి. ప్రభుత్వానికి కూడా భారీగా నష్టం వచ్చింది. ఎందరో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది.
READ MORE: Tirumala: రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ..
Also Read
స్టేషన్ మాస్టర్కి ఆలస్యంగా హెచ్చరిక వచ్చింది..
ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం.. ఈ రైలు మధ్యాహ్నం 2:28 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే 2:30 గంటలకు స్టేషన్ మాస్టర్కు 30 kmph వేగ పరిమితిని నిర్ధారించాలని, వేగంగా వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేయబడింది. హెచ్చరిక ఆర్డర్ ప్రకారం.. రైలు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడపకూడదు. అయితే స్టేషన్మాస్టర్కు హెచ్చరిక అందే సమయానికి రైలు ట్రాక్లో లోపం ఉన్న ప్రదేశానికి చేరుకుంది. 2:32 గంటలకు రైలు కోచ్లు పట్టాలు తప్పాయని ఉమ్మడి నివేదికలో కూడా రాశారు. రైలు 2:28కి స్టేషన్ దాటడానికి 2 నిమిషాల ముందే స్టేషన్ మాస్టర్కు హెచ్చరిక అందజేసి ఉంటే.. బహుశా ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని నివేదికలో స్పష్టమైంది. ట్రాక్లో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ట్రాక్లో కొంత అవాంతరాలున్నట్లు పట్టాలు తప్పినందుకు సంబంధించిన ఉమ్మడి నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. 350 మీటర్ల మేర ట్రాక్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?