Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News The Congress Has Been Raising Corruption Charges Against The Implementation Of The Safe Kerala

Congress : కర్ణాటకలో 40శాతం కమీషన్ ఉంటే.. కేరళలో 80శాతం: కాంగ్రెస్

Published Date :May 15, 2023 , 4:44 pm
By NTV WebDesk
Congress : కర్ణాటకలో 40శాతం కమీషన్ ఉంటే.. కేరళలో 80శాతం: కాంగ్రెస్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కర్ణాటకలో బీజేపీ సర్కార్ ను 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ విర్శించింది. ఇప్పుడు కేరళలోని అధికార ఎల్‌డిఎఫ్‌ను కూడా 80 శాతం కమీషన్ పాలనగా అభివర్ణిస్తున్నారు. ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత పాలక వామపక్షాలు, కేరళ ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని పెంచిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల విమర్శించారు. ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని ఆయన ఆరోపించారు.

Also Read : Vaishnav Tej: ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా మారిన మెగా మేనల్లుడు… మాములుగా లేడుగా

Also Read

  • Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
  • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..
  • Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?
  • Vijay-Governor: గవర్నర్‌కు విజయ్ మరో షాకింగ్ లెటర్.. మ్యాజిక్ ఫిగర్ ఎంతేశారంటే..!
Add as a preferred
source on google

కర్ణాటకలో 40 శాతం కమీషన్ తీసుకుంటే.. ఇక్కడ (కేరళలో) 80 శాతం కమీషన్ తీసుకుంటున్నారు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరా స్కామ్‌కు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నితలా ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ ఆధిక్యంపై స్పందిస్తూ రెండ్రోజుల క్రితం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ కూడా ఇదే విధమైన ఆరోపణలు చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రచారం అక్కడ పాలక ప్రభుత్వం తీసుకుంటున్న 40 శాతం కమీషన్‌ను హైలైట్ చేసిందని సతీశన్ అన్నారు.

Also Read : Kauri Darden Richins: భర్తని చంపింది.. అతనిపై పుస్తకం రాసింది.. చివరికి అలా దొరికింది

కేరళలో 46- 65 శాతం కమిషన్ ను వామపక్షాల ప్రభుత్వం తీసుకుంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సేఫ్ కేరళ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను ట్రాక్ చేయడానికి మోటారు వాహన శాఖ 726 AI- ఎనేబుల్డ్ కెమెరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించే లక్ష్యంతో చేపట్టిన సేఫ్ కేరళ ప్రాజెక్టును ఏప్రిల్‌లో ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు గుప్పిస్తోంది.

Also Read : Karnataka CM : హస్తినకు చేరిన కర్ణాటక సీఎం పంచాయితీ

సేఫ్ కేరళ ప్రాజెక్ట్ ముసుగులో అధికారంలో ఉన్న వారి బంధువుల జేబులు నింపడానికి వామపక్ష ప్రభుత్వం ప్రజలను దోచుకోవడాన్ని పార్టీ అనుమతించదని రమేష్ చెన్నితాల అన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బంధువు ఒకరు ఏఐ కెమెరాల ఏర్పాటు పనులు చేపట్టిన ఓ ప్రైవేట్‌ కంపెనీతో సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణలున్నాయి. పర్యవసానంగా భారీ ప్రజాందోళనకు భయపడి ప్రాజెక్ట్ కింద జరిమానా విధించడాన్ని ఇంకా అమలు చేయలేదని రమేష్ చెన్నితాల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు సమస్యలపై ఈ నెల 20న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించనున్నట్లు రమేష్ చెన్నితాల తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chief minister Pinarayi Vijayan
  • congress
  • Corruption
  • LDF Govt
  • Safe Kerala

తాజావార్తలు

  • Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..

  • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..

  • China: జిన్‌పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక ‘అసలు’ మిస్టరీ ఇదేనా!

  • Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?

  • Vijay-Governor: గవర్నర్‌కు విజయ్ మరో షాకింగ్ లెటర్.. మ్యాజిక్ ఫిగర్ ఎంతేశారంటే..!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions