Central Election Commission: ఆంధ్రప్రదేశ్లో మరోసారి పర్యటనకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల కమిషన్.. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష టీడీపీకి కూడా పోటాపోటీగా కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేశాయి.. దీంతో.. రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది సీఈసీ.. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన కొనసాగనుంది.. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన కొనసాగనుంది.. ఈ రాత్రికి విజయవాడ చేరుకోనుంది ఎన్నికల అధికారుల బృందం.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్ల పర్యటన కొనసాగనుంది..
Read Also: Manchu Lakshmi : ముంబైలో మంచు లక్ష్మీ ఇల్లు ఎంత బాగుందో చూశారా?.. వీడియో వైరల్..
ఇక, ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు వివిధ రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషనర్ సమావేశం కానుంది.. ఓటర్ల జాబితాలో అవకతవకలు, పార్టీల ఫిర్యాదులపై రాష్ట్ర సీఈవోతో సమీక్ష చేయనుంది సీఈసీ.. అనంతరం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష సమావేశం నిర్వహించనుంది. మరోవైపు.. ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 10న ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఈవో.. ఎన్నికల కమిషన్, కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఈసీ భేటీ కానుంది. ఈనెల 10న సాయత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం నిర్వహించనుండగా.. అదే రోజు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానుంది కేంద్ర ఎన్నికల బృందం.