Kaveri water: కర్ణాటకకు షాక్ .. తమిళనాడుకు రోజూ 5వేల క్యూసెక్కులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Cauvery Management Authority Board: ఇప్పటికే నీటి సమస్యతో అల్లాడుతున్న కర్ణాటకపై మరో భారం పడింది. కర్ణాటకకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. సోమవారం జరిగిన కావేరి నదీ జలాల నిర్వహణ కమిటీ సమావేశంలో బోర్డు కర్ణాటక ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. వర్షాలు పడనప్పటికీ మరో 15 రోజుల పాటు తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని ఆదేశించింది. ప్రతి రోజూ ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేయాలని కావేరీ మేనేజ్మెంట్ అథారిటీ బోర్డ్ ఆదేశించింది. ఇప్పటికే తమిళనాడుకు ప్రతి రోజు 1, 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు దీనికి అదనంగా మరో 3,100 క్యూసెక్కుల నీటిని కర్ణాటక విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది కావేరీ నదీ జలాల నిర్వహణ కమిటీ. 22 శాతం అంశాన్ని అనుసరించాలని, వర్షాభావ కారణంగానే నీరు లేక తాము ఇంతలా పట్టుబడుతున్నామని తమిళనాడు తెలిపింది.
Also Read: Father Death: ఈమె అసలు కూతురేనా.. తండ్రి చనిపోయాడంటే ఎలా మాట్లాడిందో చూడండి
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
దీనిపై స్పందించిన అథారిటీ చైర్మన్ వర్షపాతానికి వచ్చే ప్రవాహానికి సంబంధం లేదన్నారు. దీనికి తోడు కర్ణాటక సభ్యులు కూడా వర్షపాతం పై కాకుండా వచ్చే ఇన్ ఫ్లో ఆధారంగానే రెండు రాష్ట్రాల పరిస్థితులను అంచనా వేశారు. దీంతో వచ్చే 15 రోజుల పాటు రోజుకు 5000 కూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కోరారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే నీటిని తాగునీటి కోసం నిల్వ ఉంచుకోకుండా వ్యవసాయం కోసం ఎక్కువగా తరలించింది తమిళనాడు ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం అక్కడ నీటి సమస్యలు తలెత్తాయి. ఇక కర్ణాటక ప్రభుత్వం మాత్రం నీటిని ఆచితూచి ఖర్చుచేస్తుంది. వర్షాభావ పరిస్థితులు ఉండటంతో, ఆగస్ట్లో వానలు కురవకపోవడంతో పంటలు వేయవద్దని కావేరి పరీవాహక ప్రాంత రైతులను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ విషయంలో రైతులు ప్రభుత్వంపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కావేరీ నీటిని తమిళనాడుకు మళ్లించి రావడం కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై వెనక్కి తగ్గకుండా ఢిల్లీలో జరగనున్న కావేరీ రివర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశంలో మాట్లాడాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తుంది. నీటిని విడుదల చేయలేమని గట్టిగా వాదించాలని నిర్ణయించింది కర్ణాటక ప్రభుత్వం. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!