Jay Shah: క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన జై షా..
- ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్
- భారత్ కు ఆరు పతకాలు
- క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన జై షా
- ఎన్ సీఏలో క్రికెట్ తో పాటు ఇతర క్రీడాకారులు కూడా ప్రాక్టీస్ కి అవకాశం
- వారికి మెరుగైన సౌకర్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది. ఈసారి భారతదేశం నుంచి 117 మంది అథ్లెట్ల బృందం పాల్గొనగా.. అందులో దేశానికి 1 రజతం, 5 కాంస్య పతకాలు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) సిద్ధమవుతుందని.. ఇందులో క్రికెటర్లతో పాటు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సహా ఇతర అథ్లెట్లు కూడా ప్రాక్టీస్ చేయగలరని ఆయన చెప్పారు. వారికి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
READ MORE: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..
Also Read
భారత అథ్లెట్లను ఆదుకునేందుకు బీసీసీఐ ఎప్పుడూ ముందుంటుందని జై షా అన్నారు. ‘నీరజ్ చోప్రా వంటి ఒలింపిక్ ప్లేయర్లకు కూడా దీన్ని అందుబాటులో ఉంచబోతున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి ఓ జాతీయ మీడియా సంస్థకి తెలిపారు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) బెంగళూరులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నగరంలో కొత్త ఎన్ సీఈ కూడా దాదాపు పూర్తయింది. వచ్చే నెలలో దీనిని ప్రారంభించనున్నారు. బీసీసీఐ యొక్క అతిపెద్ద ప్రాజెక్ట్లలో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ కూడా ఒకటి. ఇటీవల జై షా నీరజ్ చోప్రాను కలిశారు. అప్పుడు బీసీసీఐ కార్యదర్శి డబుల్ ఒలింపిక్ పతక విజేత నీరజ్తో మాట్లాడుతూ.. క్రికెటర్లు కానివారికి కూడా అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు జే షా తన వాగ్దానాన్ని నెరవేర్చారు.
READ MORE: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నేను అక్టోబర్ 2019 లో బాధ్యతలు స్వీకరించాను. కరోనా కారణంగా 2 సంవత్సరాలు కార్యాలయం మూతపడి ఉంది. సెకండ్ వేవ్ అప్పుడు (2022లో) వచ్చినప్పుడు.. ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. నా మొదటి పదవీ కాలంలోనే ఈ ప్రాజెక్టుకు పునాది పడినందుకు సంతోషిస్తున్నను.” అని తెలిపారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!