Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో శశిథరూర్.. ఆ ఇద్దరి మధ్యే పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరగనున్న ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. పోటీ చేసేందుకు నామినేషన్ సెట్లను కూడా సేకరించారు. ఎన్నికల కోసం ఐదు సెట్ల నామినేషన్ పత్రాలు కావాలని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ మధూసూదన్ మిస్త్రీని లేఖ ద్వారా కోరారు. శశిథరూర్ ప్రతినిధి ఒకరు ఆ సెట్లను సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన మొదటి నాయకుడిగా శశిథరూర్ నిలిచారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించడంతో ఆ పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఈ ఎన్నికల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేరళ ఎంపీ శశిథరూర్ తలపడబోతున్నారు. అశోక్ గెహ్లాట్కు అధిష్ఠానం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో శశిథరూర్ ఒకరిగా ఉన్నారు. 20 ఏళ్లుగా గాంధీలతో పాటు సోనియా గాంధీ లేదా ఆమె కుమారుడు రాహుల్ వద్ద ఉన్న పదవికి పోటీ చేయాలనే ఉద్దేశాన్ని థరూర్ తొలిసారిగా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని కావాలని కలలు కంటున్న తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు సొంత రాష్ట్రం నుంచే ఎదురుగాలి వీస్తోంది. ఆయన అంతర్జాతీయస్థాయి వ్యక్తి అని, అధ్యక్ష పదవికి పోటీ చేయకపోవడమే మంచిదని సొంతం రాష్ట్రం నేతలు హితవు చెబుతున్నారు. నిజానికి రాహుల్ గాంధీకే తిరిగి పట్టం కట్టాలంటూ చాలా రాష్ట్రాలు తీర్మానాలు కూడా చేశాయి. అయితే, అవి చెల్లబోవంటూ సీనియర్ నేత జైరాం రమేశ్ వంటివారు చెబుతున్నా పీసీసీలు మాత్రం తీర్మానం చేస్తూనే ఉన్నాయి.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
5G Rollout In India: 5జీ ప్రారంభానికి డేట్ ఫిక్స్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
అక్టోబర్ 17న జరగనున్న ఎన్నికల్లో శశిథరూర్కు అశోక్ గెహ్లోట్పై పెద్ద సవాల్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెహ్లాట్ చాలా కాలంగా గాంధీ కుటుంబానికి విధేయుడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు గురువారం ధ్రువీకరించారు. పార్టీ మూలాల ప్రకారం, గెహ్లాట్ గాంధీల మద్దతుతో అనధికారిక అభ్యర్థి కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడు అనేక రాజకీయ సునామీల నుంచి కూడా బయటపడ్డాడు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మధ్య పోటీ జరిగే అవకాశం ఉంది. అభ్యర్థులు సెప్టెంబర్ 30 వరకు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఎన్నికలు అక్టోబరు 17న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు అక్టోబరు 19న జరుగుతుంది.
ఇదిలావుండగా, గాంధీ కుటుంబానికి చెందని నేత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న సందర్భం 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాబోతోంది. సీతారాం కేసరి నుంచి 1998లో ఆ పార్టీ పగ్గాలను సోనియా గాంధీ స్వీకరించారు. సీతారాం కేసరి 1997లో శరద్ పవార్, రాజేశ్ పైలట్లను ఓడించి, ఆ పదవిని చేపట్టారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!