పండుగ రద్దీ.. TGSRTC 5,375 స్పెషల్ బస్సులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక రవాణా ఏర్పాట్లతో సేవల్ని అందిస్తోంది. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక బస్సులను నడుపుతూ, వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది.
ఈ నెల 9వ తేదీ నుంచి పండుగ రద్దీకనుగుణంగా ప్రత్యేక బస్సుల సేవలను ప్రారంభించిన ఆర్టీసీ.. 13వ తేదీ వరకు మొత్తం 5,375 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేసింది. గత నాలుగు రోజులుగా ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. ఇంకా రవాణా సేవలపై అధికారులు, సూపర్వైజర్లు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
Also Read
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
Siriలోకి Gemini పవర్.. Googleతో Apple భారీ AI ఒప్పందం.!
రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి, బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్లో ప్రధాన రద్దీ కేంద్రాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోంది. రోజువారీగా ఆపరేట్ చేసిన స్పెషల్ బస్సుల వివరాలను సంస్థ వెల్లడించింది.
ఈ నెల 9 వ తేదిన 721, 10వ తారీఖున 1645, 11వ తారీఖున 1180, 12వ తారీఖున 1109, 13వ తారీఖున (6 గం.ల వరకు) 720 ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపింది. ప్రధానంగా జేబీఎస్ నుంచి 1,484, ఎంజీబీఎస్ నుంచి 1,170, ఉప్పల్ నుంచి 807, కేపీహెచ్బీ నుంచి 916, ఎల్బీనగర్ నుంచి 715, ఆరాంఘర్ నుంచి 283 స్పెషల్ బస్సులు నడిపినట్లు పేర్కొంది.
సంక్రాంతి పండుగ అనంతరం తిరుగు ప్రయాణంలో కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రత్యేక రవాణా సేవల నిర్వహణలో సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని సంస్థ పేర్కొంది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అవసరమైన సమాచారాన్ని ముందుగానే అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సుదూర ప్రయాణాలు చేసే వారు ముందస్తు రిజర్వేషన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుని టీజీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!