నేడు యూపీఐ చెల్లింపులు జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. ఆన్లైన్ షాపింగ్ కు మాత్రమే కాకుండా.. చిన్న చిన్న కిరాణా సామన్లు కొనుగోలు చేసేందుకు కూడా ఈ చెల్లింపు విధానాన్ని ఉపయోగిస్తున్నాం. భారతదేశాన్ని ‘న్యూ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’గా మార్చడానికి ఇది చాలా ముఖ్యమైన సాధనం. ఇప్పటికే జనాలు ఈ యూపీఐ చెల్లింపు విధానానికి అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానం మొదలు పెట్టింది.
READ MORE: Hyderabad: 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన వివాహిత.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో..
ప్యాసింజర్ – కండక్టర్ మధ్య చిల్లర గొడవలకు ఈ విధానంతో స్వస్తి పలకచ్చు. ఇప్పటి నుంచి ప్రతి సిటీ బస్సులో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ఉంచుతారు. యూ పీ ఐ పెమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు టీజీఎస్ ఆర్టీసీ కల్పించింది.. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆర్టీసీ ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చింది. త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకీ తీసుకొస్తామని ఆర్టీసీ ప్రకటించింది.
READ MORE: Poonam Kaur: నేను ఇబ్బంది పడ్డా.. పోసాని ఆరోగం గురించి దిగులుగా ఉంది!
కాగా.. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. అయితే, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రయాణికుల ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది.