TG EAPCET : తెలంగాణలో ముగిసిన టీజీ ఎప్సెట్ పరీక్షలు.. 93% పైగా హాజరు
- ప్రశాంతంగా ముగిసిని టీజీ ఎప్ సెట్
- 93% హాజరుతో విజయవంతం
- త్వరలో ప్రాథమిక కీ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG EAPCET : తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ టీజీ ఎప్సెట్) – 2025 విజయవంతంగా ముగిసింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) ఈ పరీక్షను నిర్వహించింది. అయితే.. తాజాగా విడుదలైన ప్రకటన ప్రకారం, ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. మే 4, 2025న జరిగిన ఈ పరీక్షలకు సుమారుగా 93 శాతం పైగా హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫోర్నూన్ సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు.
India Pakistan Tension: పాక్ ఆర్మీ జనరల్స్, మంత్రులు పారిపోయేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
జేఎన్టీయూహెచ్ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. కట్టా నరసింహారెడ్డి, టీజీ ఈఏపీసెట్-2025 కన్వీనర్ ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలాకిష్ట రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. విజయ కుమార్ రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్ రావు తదితరులు కీలక పాత్ర పోషించారు. పరీక్షల హాజరు వివరాలను పరిశీలిస్తే.. అగ్రికల్చర్ & ఫార్మసీ స్ట్రీమ్లో 92% నుంచి 94% వరకు హాజరు నమోదైంది. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో కూడా దాదాపుగా ఇదే స్థాయిలో, 93% నుంచి 94% వరకు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ అధిక శాతం హాజరు విద్యార్థుల్లోని పోటీతత్వాన్ని, ఉన్నత విద్యపై వారికున్న ఆసక్తిని తెలియజేస్తోంది.
ఈ పరీక్షల ప్రాథమిక కీ (Preliminary Key) త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతరం విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తానికి, టీజీ ఈఏపీసెట్-2025 పరీక్షలు అధిక శాతం హాజరుతో విజయవంతంగా ముగియడం విద్యార్థులకు ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పవచ్చు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ అధికారులు త్వరలోనే తదుపరి ప్రకటనలు విడుదల చేయనున్నారు.
Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!