TG EAPCET : తెలంగాణలో ముగిసిన టీజీ ఎప్సెట్ పరీక్షలు.. 93% పైగా హాజరు
- ప్రశాంతంగా ముగిసిని టీజీ ఎప్ సెట్
- 93% హాజరుతో విజయవంతం
- త్వరలో ప్రాథమిక కీ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG EAPCET : తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ టీజీ ఎప్సెట్) – 2025 విజయవంతంగా ముగిసింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) ఈ పరీక్షను నిర్వహించింది. అయితే.. తాజాగా విడుదలైన ప్రకటన ప్రకారం, ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. మే 4, 2025న జరిగిన ఈ పరీక్షలకు సుమారుగా 93 శాతం పైగా హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫోర్నూన్ సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు.
India Pakistan Tension: పాక్ ఆర్మీ జనరల్స్, మంత్రులు పారిపోయేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు..
Also Read
- Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
జేఎన్టీయూహెచ్ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. కట్టా నరసింహారెడ్డి, టీజీ ఈఏపీసెట్-2025 కన్వీనర్ ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలాకిష్ట రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. విజయ కుమార్ రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్ రావు తదితరులు కీలక పాత్ర పోషించారు. పరీక్షల హాజరు వివరాలను పరిశీలిస్తే.. అగ్రికల్చర్ & ఫార్మసీ స్ట్రీమ్లో 92% నుంచి 94% వరకు హాజరు నమోదైంది. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో కూడా దాదాపుగా ఇదే స్థాయిలో, 93% నుంచి 94% వరకు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ అధిక శాతం హాజరు విద్యార్థుల్లోని పోటీతత్వాన్ని, ఉన్నత విద్యపై వారికున్న ఆసక్తిని తెలియజేస్తోంది.
ఈ పరీక్షల ప్రాథమిక కీ (Preliminary Key) త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతరం విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తానికి, టీజీ ఈఏపీసెట్-2025 పరీక్షలు అధిక శాతం హాజరుతో విజయవంతంగా ముగియడం విద్యార్థులకు ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పవచ్చు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ అధికారులు త్వరలోనే తదుపరి ప్రకటనలు విడుదల చేయనున్నారు.
Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
తాజావార్తలు
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!