TG EAPCET : తెలంగాణలో ముగిసిన టీజీ ఎప్సెట్ పరీక్షలు.. 93% పైగా హాజరు
- ప్రశాంతంగా ముగిసిని టీజీ ఎప్ సెట్
- 93% హాజరుతో విజయవంతం
- త్వరలో ప్రాథమిక కీ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG EAPCET : తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ టీజీ ఎప్సెట్) – 2025 విజయవంతంగా ముగిసింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) ఈ పరీక్షను నిర్వహించింది. అయితే.. తాజాగా విడుదలైన ప్రకటన ప్రకారం, ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. మే 4, 2025న జరిగిన ఈ పరీక్షలకు సుమారుగా 93 శాతం పైగా హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫోర్నూన్ సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు.
India Pakistan Tension: పాక్ ఆర్మీ జనరల్స్, మంత్రులు పారిపోయేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు..
Also Read
- Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
జేఎన్టీయూహెచ్ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. కట్టా నరసింహారెడ్డి, టీజీ ఈఏపీసెట్-2025 కన్వీనర్ ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలాకిష్ట రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. విజయ కుమార్ రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్ రావు తదితరులు కీలక పాత్ర పోషించారు. పరీక్షల హాజరు వివరాలను పరిశీలిస్తే.. అగ్రికల్చర్ & ఫార్మసీ స్ట్రీమ్లో 92% నుంచి 94% వరకు హాజరు నమోదైంది. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో కూడా దాదాపుగా ఇదే స్థాయిలో, 93% నుంచి 94% వరకు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ అధిక శాతం హాజరు విద్యార్థుల్లోని పోటీతత్వాన్ని, ఉన్నత విద్యపై వారికున్న ఆసక్తిని తెలియజేస్తోంది.
ఈ పరీక్షల ప్రాథమిక కీ (Preliminary Key) త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతరం విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తానికి, టీజీ ఈఏపీసెట్-2025 పరీక్షలు అధిక శాతం హాజరుతో విజయవంతంగా ముగియడం విద్యార్థులకు ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పవచ్చు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ అధికారులు త్వరలోనే తదుపరి ప్రకటనలు విడుదల చేయనున్నారు.
Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
తాజావార్తలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
-
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!