COVID 19 : ఢిల్లీలో కరోనా టెన్షన్.. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా మళ్లీ కలకలం రేపుతుంది. దీంతో ప్రజల్లో ఆందోళన అధికమవుతుంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ కేసుల పెరుగుదల గణనీయంగా ఉందని డాక్టర్లు తెలిపుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిపుణులు మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు.
Also Read : KTR letter to Centre: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ఆపండి! కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Also Read
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో పాఠశాలల్లో కొత్త తరగుతులు ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లల గురించి తల్లిదండ్రుల్లో మళ్లీ భయం మొదలైంది. పిల్లల చదువులతో పాటు ఆరోగ్యం విషయంలోనూ టెన్షన్ పడుతున్నారు. పాఠశాలలు మళ్లీ ఆన్ లైన్ లో నడుస్తాయా.. మాస్కులు తప్పనిసరి అవుతాయా పిల్లల ఆరోగ్యం సంగతేంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read : Naatu Naatu Song : నాటు నాటు సాంగ్ కు ఆలియా భట్, రష్మిక స్టెప్పులు
పాఠశాలల పున: ప్రారంభమైనప్పుడు పిల్లలకు కరోనా వైరస్ సోకుతుందనే ఆందోళన మధ్య పేరెంట్స్ ఉన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ చికిత్సతో వారు త్వరగా కోలుకుంటున్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులైన పిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు ఉపయోగించడం వంటి కోవిడ్ తగిన ప్రవర్తనను పాటించడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Also Read : BJP Leader: హైవేపై జరిగిన కాల్పుల్లో బీజేపీ నాయకుడు హతం
పాఠశాలల యాజమాన్యాలు సైతం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. కరోనా, ప్లూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్కూల్స్ యాజమాన్యాలు తెలిపుతున్నారు. పాఠశాలలో మెడికల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాట్లు తెలియజేస్తున్నారు. చిన్నారులకు ఏదైనా సమస్య వస్తే వెంటనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా సందర్శనలో వైద్యులు కూడా ఉంటారని.. వారు ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలియజేస్తున్నారు.
Also Read : Summer Holidays: హమ్మయ్య.. సెలవులు వచ్చేశాయోచ్చ్..
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 416 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 7 నెలల తర్వాత రాజధానిలో 400కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఆగస్టు 31 తర్వాత తొలిసారిగా బుధవారం 300 కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 416 పాజిటివ్ కేసులు పెరిగాయి. ఇదిలా ఉండగా.. భారత్ లో గత 24 గంటల్లో మూడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!