Tenali Double Horse : తెలుగు రాష్ట్రాలలో దాల్ ఉత్పత్తుల నాణ్యతకు మారుపేరు అయిన తెనాలి డబుల్ హార్స్ గ్రూప్, ఇప్పుడు సూపర్ఫుడ్స్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో, కంపెనీ తన నూతన మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల శ్రేణిని “మిల్లెట్ మార్వెల్స్” పేరుతో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించింది. ఈ మహత్తర ప్రారంభోత్సవం 2025, ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 10:00 గంటలకు, హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీత రెడ్డి గారు హాజరై, నూతన ఉత్పత్తుల శ్రేణిని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. ఆమెతో పాటు, తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మోహన్ శ్యామ్ ప్రసాద్ మునగాల గారు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు.
సాంప్రదాయానికి, ఆరోగ్యానికి మధ్య సేతువులా నిలిచే మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు ఈ బ్రాండ్ను పరిచయం చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఆహ్వానిస్తూ సంస్థ ప్రకటించింది – “మీ సహకారం మా ప్రయాణానికి బలమైంది. మీ సమక్షం మాకు గౌరవంగా ఉంటుంది.” తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ కొత్తవైపు తీసుకుంటున్న ఈ అడుగు, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులకు మరింత ఆనందకరమైన పరిణామంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.
Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య