Medaram Jatara : మేడారంలో తాత్కాలిక బస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడారంలో భక్తుల కోసం తాత్కాలిక బస్ స్టేషన్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. 55 ఎకరాల్లో బెస్ క్యాంప్తో కూడిన బస్ స్టాండ్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఓకే సారి 30 వేల మంది క్యూ లైన్లో ఉండేలా బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. మేడారం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి సుధాకర్ ప్రారంభానికి రాలేక పోయారని ఆమె వెల్లడించారు. గతంతో పోలిస్తే 20 ఎకరాలను ఎక్కువగా బస్ స్టాండ్ ను విస్తరించామని ఆమె పేర్కొన్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని, రెండు సంవత్సరాల కొకసారి సమ్మక్క, సారక్క వన దేవతలు బయటకు వస్తారన్నారు. డబ్బులతో సంబంధం లేకుండా ప్రజలు వచ్చే పండుగ మేడారం జాతర అని ఆమె అన్నారు. వందల కిలోమీటర్లు బంగారాన్ని నెత్తిన పెట్టుకొని వస్తారని, మేడారం కు వచ్చే దారిలో పార్కింగ్, తాత్కాలిక బస్ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతర విజయవంతం లో టీ ఎస్ ఆర్టీసీ కృషి ఎంతో ఉంటుందని, భక్తులు స్వియనియంత్రణ తో దర్శనం చేసుకోవాలనీ కోరుతున్నామన్నారు.
Neti Bharatham: ఒకే పాత్రతో ‘నేటి భారతం’ సినిమా.. ఆసక్తికరంగా ట్రైలర్
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే ప్రసిద్ధ గిరిజన జాతర సమ్మక్క సారక్క మేడారం జాతర కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది . ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 24 వరకు రైళ్లు నడపనున్నట్లు కేంద్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి ద్వైవార్షిక కార్యక్రమం కోసం భక్తులు మేడారం వెళ్లేందుకు ఈ ప్రత్యేక రైళ్లు దోహదపడతాయి. ప్రత్యేక రైళ్లు 07017/07018 సిర్పూర్ కాగజ్నగర్ – వరంగల్ – సిర్పూర్ కాగజ్నగర్, 07014/07015: వరంగల్ – సికింద్రాబాద్ – వరంగల్ , 07019/0720 నిజామాబాద్ – వరంగల్ – నిజామాబాద్ ఈ రైళ్లు సికింద్రాబాద్, హైదరాబాద్, సిర్పూర్ కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాలు, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భోంగీర్, జనగాం, ఘన్పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రాంతాలకు కనెక్టివిటీని నిర్ధారిస్తాయి. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు, సంరక్షించేందుకు, గిరిజన వర్గాల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అన్నారు. సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లతో పాటు జాతర నిర్వహణకు కేంద్రం రూ.3 కోట్లు మంజూరు చేయనుంది.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..