Grama Sabalu : నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు
- నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు
- ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక
- లబ్దిదారుల జాబితా గ్రామ సభల్లో ప్రకటన
- అర్హత ఉన్నా పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తుల స్వీకరణ
- ఈ నెల 24 వరకు జరగనున్న గ్రామ సభలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grama Sabalu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి అమలు చేయబోయే నాలుగు ముఖ్యమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. గతంలో అందిన దరఖాస్తుల ఆధారంగా ఫీల్డ్ సర్వే బృందాలు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారి వివరాలను సేకరించి, అర్హుల జాబితాను రూపొందించి సంబంధిత అధికారులకు అందించారు. ఈ జాబితాలను గ్రామ, వార్డు స్థాయి సభల్లో బహిరంగంగా చదవనున్నారు. జాబితాలో ఉన్న పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, ఆయా అభ్యంతరాలను స్వీకరించేందుకు ఇంచార్జి అధికారులను నియమించారు.
ఎంపీడీఓ ఆధ్వర్యంలో విలేజ్ సెక్రటరీ, ఆర్ఐ, ఏఈవో, ఏవోలు టీంలు గ్రామ స్థాయిలో పనిచేస్తూ అభ్యంతరాలు, కొత్త దరఖాస్తులను స్వీకరిస్తాయి. ఈ నెల 26 నాటికి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేసి, గ్రామసభల్లో ఆమోదించబడుతుంది.
Also Read
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
ప్రధాన పథకాలు:
రేషన్ కార్డులు: ఆమోదిత జాబితా ప్రకారమే కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడతాయి.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చి జాబితా తయారు చేయబడింది.
రైతు భరోసా: సాగు భూములు ఉన్న రైతులకు రూ. 12,000 పెట్టుబడి సాయం అందజేస్తారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: భూమిలేని కూలీలకు ఏటా రూ. 12,000 ఆర్థిక సాయం అందించనున్నారు.
ఫీల్డ్ సర్వే వివరాలు:
సర్వేలో 17,000 ఎకరాల సాగు చేయని భూములను గుర్తించారు.
రియల్ ఎస్టేట్ కోసం వినియోగిస్తున్న భూములను రైతు భరోసా పథకానికి అనర్హంగా తేల్చారు.
నిజామాబాద్లో 8,575 ఎకరాలు, కామారెడ్డిలో 8,500 ఎకరాలు సాగుకు అనర్హంగా గుర్తించారు.
గ్రామ సభలలో లబ్ధిదారుల జాబితా:
ఫీల్డ్ సర్వే బృందాలు సొంత స్థలం ఉన్న లబ్ధిదారుల వివరాలను సేకరించి జాబితా రూపొందించాయి.
మిస్ అయిన పేర్లను పునఃసమీక్షించి, అవసరమైతే కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ముఖ్యంగా దివ్యాంగులు, పంచాయతీ కార్మికులు, ఇండ్ల లేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
సమగ్ర ప్రచారం ఆదేశాలు:
జనవరి 21 నుండి 24 వరకు జరగనున్న గ్రామ, వార్డు సభల గురించి విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు.
ఆయా సభల్లో లబ్ధిదారుల జాబితాలను వివరించి, ప్రజల అభ్యంతరాలను స్వీకరించాలి.
పథకాలకు సంబంధించిన కొత్త దరఖాస్తులను పరిశీలించి, తుది జాబితాను ఆమోదించాలి.
ఉపాధి హామీ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక:
ఉపాధి హామీ కింద 2023-24లో కనీసం 20 రోజులు పని చేసిన వారి జాబితాను గుర్తించి, భూమిలేని 25,501 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. తుది జాబితా గ్రామసభల ద్వారా ఆమోదించబడుతుంది. ఈ చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత సమర్థంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!