Telangana Film Chamber: తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. ఇక నుంచి పర్సంటేజీ విధానంలోనే.
- కీలక నిర్ణయం తీసుకునన తెలంగాణ ఎగ్జిబిటర్లు..
- ఇక నుంచి అద్దె విధానానికి స్వస్తి..
- పర్సంటేజీ విధానానికి అంగీకరించిన 23 థియేటర్ల యాజమాన్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని సినిమా థియేటర్ల నిర్వహణలో ఏప్రిల్ 3, 2026 నుంచి ఒక కొత్త మార్పు రాబోతోంది. ఇప్పటివరకు నడుస్తున్న రెంటల్ విధానంలో స్థానంలో, ఇకపై పర్సంటేజీ విధానం రాబోతోంది. దీని ప్రకారం సినిమాలను ప్రదర్శించాలని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది.
ఏమిటీ నిర్ణయం?
సాధారణంగా థియేటర్ల యజమానులు డిస్ట్రిబ్యూటర్ల నుంచి అద్దె తీసుకుని సినిమాలు ప్రదర్శిస్తుంటారు. అయితే, మారుతున్న కాలంలో థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, ప్రేక్షకుల రాక తగ్గడం వంటి కారణాలతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి, 23 ప్రధాన థియేటర్ల ఎగ్జిబిటర్లు అగ్ర డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపి ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు.
Also Read
- Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
Also Read:Ola Bike Price Drop: శుభవార్త చెప్పిన ఓలా.. ఆ ఎలక్ట్రిక్ బైక్ ధరలు భారీగా తగ్గింపు..
కొత్తగా అమలయ్యే వాటాల వివరాలు…
వచ్చే వారం (ఏప్రిల్ 3) నుంచి సినిమాల వసూళ్లలో థియేటర్ వాటా ఇలా ఉంటుంది.. మొదటి వారం.. వసూళ్లలో 60 శాతం, రెండో వారం వసూళ్లలో 50 శాతం, మూడో వారం వసూళ్లలో 40 శాతం. సినిమా ప్రదర్శన కొనసాగాలంటే ఒక షోకి కనీసం ‘హౌస్ ఫుల్ గ్రాస్’ వసూలు కావాలనే నిబంధన కూడా పెట్టారు.
ఎందుకు ఈ మార్పు..?
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి వి.ఎల్. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న అద్దె పద్ధతితో థియేటర్లను నడపడం కష్టంగా మారింది. ఖరీదైన లొకేషన్లలో ఉన్న థియేటర్లలో ప్రేక్షకులకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పించడానికి భారీగా ఖర్చవుతోంది.

ఇటీవల బెంగళూరులో జరిగిన సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్ల సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ శాతాల పద్ధతి అమలవుతోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు శాశ్వతంగా మూతపడకుండా కాపాడుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా చెప్పుకొచ్చారు.
రాబోయే రోజుల్లో అందరికీ వర్తింపు..
ప్రస్తుతానికి 23 థియేటర్లు ఈ పద్ధతిని ప్రారంభిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు దశలవారీగా ఇదే విధానంలోకి మారనున్నాయి. ఈ నిర్ణయం వల్ల థియేటర్ యజమానులకు ఊరట లభిస్తుందని.. సినిమా పరిశ్రమ మనుగడకు ఇది మేలు చేస్తుందని చాంబర్ సభ్యులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?