Ola Bike Price Drop: శుభవార్త చెప్పిన ఓలా.. ఆ ఎలక్ట్రిక్ బైక్ ధరలు భారీగా తగ్గింపు..
- ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసే వారికి శుభవార్త..
- రోడ్స్టర్ వాహనం ధర భారీగా తగ్గించిన ఓలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వాహనదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. తన ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ అయిన రోడ్స్టర్ X+ 9.1 kWh ధరను ఏకంగా రూ. 60,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఈ బైక్ ధర రూ. 1,89,999 ఉండగా.. ఇప్పుడు అది కేవలం రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) కే లభించనుంది.
ధర ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి..?
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ఖర్చే అత్యధికంగా ఉంటుంది. ఓలా కంపెనీ తన ‘గిగా ఫ్యాక్టరీ’లో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ‘4680 భారత్ సెల్’ అనే బ్యాటరీలను తయారు చేస్తోంది. ఈ సెల్స్ ఉత్పత్తి భారీ స్థాయిలో పెరగడంతో తయారీ ఖర్చులు బాగా తగ్గాయి. సొంతంగా బ్యాటరీలు తయారు చేసుకోవడం వల్ల కలిగిన ఈ ఆర్థిక లాభాన్ని కంపెనీ నేరుగా కస్టమర్లకే బదిలీ చేయాలని నిర్ణయించుకుంది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
ఎప్పుడు కొనుగోలు చేయవచ్చు..?
అయితే.. ఈ బైక్ను ఎప్పుడు పడితే అప్పుడు కొనే అవకాశం లేదు. దీనిని కేవలం పరిమిత సమయ విండోల్లో (Limited Purchase Windows) మాత్రమే విక్రయించాలని ఓలా నిర్ణయించింది.
మొదటి కొనుగోలు అవకాశం ఏప్రిల్ 3న (శుక్రవారం) సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఇలాంటి మరిన్ని సేల్ విండోలను భవిష్యత్తులో ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.
రోడ్స్టర్ X+ ప్రత్యేకతలు..
ఈ బైక్ పనితీరు విషయానికి వస్తే, ఇది ఒక రేంజ్ కింగ్ అని చెప్పవచ్చు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న #EndICEAge క్యాంపెయిన్ వల్ల ఈ బైక్కు డిమాండ్ 5 రెట్లు పెరిగిందని కంపెనీ చెబుతోంది.
పుంజుకున్న ఓలా అమ్మకాలు..
గత మార్చి నెలలో ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రిజిస్ట్రేషన్లు 150 శాతం పెరిగాయి. ఆ నెలలో మొత్తం 10,117 యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి చివరి వారంలో ప్రతిరోజూ 1,000 కంటే ఎక్కువ ఆర్డర్లు రావడం గమనార్హం. కేవలం వాహనాల అమ్మకాలే కాకుండా.. సర్వీస్ సెంటర్ల మెరుగుదల, కస్టమర్ల నమ్మకాన్ని గెలవడంలో ఓలా సఫలమైందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి.. పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఓలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..