Ola Bike Price Drop: శుభవార్త చెప్పిన ఓలా.. ఆ ఎలక్ట్రిక్ బైక్ ధరలు భారీగా తగ్గింపు..
- ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసే వారికి శుభవార్త..
- రోడ్స్టర్ వాహనం ధర భారీగా తగ్గించిన ఓలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వాహనదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. తన ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ అయిన రోడ్స్టర్ X+ 9.1 kWh ధరను ఏకంగా రూ. 60,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఈ బైక్ ధర రూ. 1,89,999 ఉండగా.. ఇప్పుడు అది కేవలం రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) కే లభించనుంది.
ధర ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి..?
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ఖర్చే అత్యధికంగా ఉంటుంది. ఓలా కంపెనీ తన ‘గిగా ఫ్యాక్టరీ’లో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ‘4680 భారత్ సెల్’ అనే బ్యాటరీలను తయారు చేస్తోంది. ఈ సెల్స్ ఉత్పత్తి భారీ స్థాయిలో పెరగడంతో తయారీ ఖర్చులు బాగా తగ్గాయి. సొంతంగా బ్యాటరీలు తయారు చేసుకోవడం వల్ల కలిగిన ఈ ఆర్థిక లాభాన్ని కంపెనీ నేరుగా కస్టమర్లకే బదిలీ చేయాలని నిర్ణయించుకుంది.
Also Read
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
ఎప్పుడు కొనుగోలు చేయవచ్చు..?
అయితే.. ఈ బైక్ను ఎప్పుడు పడితే అప్పుడు కొనే అవకాశం లేదు. దీనిని కేవలం పరిమిత సమయ విండోల్లో (Limited Purchase Windows) మాత్రమే విక్రయించాలని ఓలా నిర్ణయించింది.
మొదటి కొనుగోలు అవకాశం ఏప్రిల్ 3న (శుక్రవారం) సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఇలాంటి మరిన్ని సేల్ విండోలను భవిష్యత్తులో ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.
రోడ్స్టర్ X+ ప్రత్యేకతలు..
ఈ బైక్ పనితీరు విషయానికి వస్తే, ఇది ఒక రేంజ్ కింగ్ అని చెప్పవచ్చు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న #EndICEAge క్యాంపెయిన్ వల్ల ఈ బైక్కు డిమాండ్ 5 రెట్లు పెరిగిందని కంపెనీ చెబుతోంది.
పుంజుకున్న ఓలా అమ్మకాలు..
గత మార్చి నెలలో ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రిజిస్ట్రేషన్లు 150 శాతం పెరిగాయి. ఆ నెలలో మొత్తం 10,117 యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి చివరి వారంలో ప్రతిరోజూ 1,000 కంటే ఎక్కువ ఆర్డర్లు రావడం గమనార్హం. కేవలం వాహనాల అమ్మకాలే కాకుండా.. సర్వీస్ సెంటర్ల మెరుగుదల, కస్టమర్ల నమ్మకాన్ని గెలవడంలో ఓలా సఫలమైందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి.. పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఓలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?