Site icon NTV Telugu

Telangana Thalli Statue: అసెంబ్లీలో కొలువుదీరిన ‘తెలంగాణ తల్లి’.. ఆవిష్కరించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

Telangana Thalli Statue

Telangana Thalli Statue

Telangana Thalli Statue: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆవరణలో రాష్ట్ర ఆత్మగౌరవ చిహ్నంగా నూతనంగా రూపొందించిన ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వైభవంగా ఆవిష్కరించారు. ఈ చారిత్రక ఘట్టం రాష్ట్ర ప్రముఖులు, మంత్రుల సమక్షంలో అత్యంత వేడుకగా జరిగింది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముందు ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల వద్ద గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఘనంగా నివాళులర్పించారు. దేశానికి, సమాజానికి వారు చేసిన అసమాన సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.

KTR: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎక్కడ?

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ విగ్రహం కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని, ఇది తెలంగాణ ప్రజల పోరాట పటిమకు, సంస్కృతికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక అని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

AI Deepfake Scam: నిర్మలా సీతారామన్ ‘AI’ వీడియోతో నమ్మించి.. వృద్ధురాలికి రూ. 87 లక్షల కుచ్చుటోపీ!

Exit mobile version