TS High Court: టీచర్ల బదిలీలపై ఈనెల 19 వరకు హైకోర్టు స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీపై ఈనెల 19 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతుల తర్వాతే బదిలీలు చేయాలని రంగారెడ్డి జిల్లా టీచర్ల తరపున దాఖలైన పిటిషన్ను నేడు (శుక్రవారం) జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బెంచ్ విచారణ చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాది బాలకిషన్ రావు వాదనలు వినిపించగా.. వాదనలు విన్న జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.. టీచర్ల బదిలీ ఈ నెల 19 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also: MG ZS EV: భారీగా తగ్గిన ఎంజీ జెడ్ఎస్ ఈవీ కార్ ధరలు..ఏకంగా రూ. 2 లక్షల వరకు ఆదా..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
కాగా, రంగారెడ్డి జిల్లాలో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్ అర్హత కేసులుండటంతో పాటు పదోన్నతులపై స్టే ఉండటంతో రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లలో పదోన్నతులు చేపట్టకుండా కేవలం బదిలీలు మాత్రమే చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై రంగారెడ్డి టీచర్లు కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం బదిలీలపై స్టే విధించింది. అయితే, తెలంగాణలో టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూలును విద్యాశాఖ విడుదల చేసింది. రెండు మల్టీజోన్లలో పదోన్నతులను పక్కన పెట్టి.. కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Also: Pawan Kalyan: సినిమా వాళ్లు భయంతో ఉన్నారు.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
రంగారెడ్డి జిల్లాల్లో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్ అర్హత కేసులు, పదోన్నతులపై స్టే ఉండటంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 3 నుంచి 8 వరకు బదిలీల ప్రక్రియ జరుగనుంది. ఈ మేరకు అక్టోబరు 3న బదిలీలకు సంబంధించిన షెడ్యూలును రిలీజ్ చేసింది. అక్టోబరు 6, 7 తేదీల్లో బదిలీలకు సంబంధించిన వెబ్ఆప్షన్కు ఛాన్స్ ఇచ్చింది. అక్టోబరు 8న వెబ్ ఆప్షన్ల సైతం ఎడిట్ చేసుకునే వీలు ఇచ్చింది. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్ పాయింట్లో ఎలాంటి మార్పులుండవని విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కానీ అనూహ్యంగా టీచర్ల బదిలీలను అక్టోబర్ 19 వరకు నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!