Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- న్యూయార్క్ సిటీలో దారుణం
- మేడ్చల్కి చెందిన యువకుడు దారుణ హత్య
- మరో 4 నెలల్లో హైదరాబాద్కు అన్షుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయార్క్ సిటీలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రానికి చెందిన యువకుని దుండగులు కాల్చి చంపారు. బతుకు తెరువు కోసం అమెరికాకు వెళ్లిన యువకుడు అక్కడ పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో పిజ్జా డెలివరీ ఇచ్చేందుకు వెళుతుండగా దుండగులు కాల్చి చంపేశారు. మేడ్చల్కి చెందిన కుంచా అన్షుల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ బాయ్గా పని చేస్తున్న అన్షుల్ను గన్తో కాల్చి చంపేశారు దుండగులు. శుక్రవారం ( జూన్ 5 ) రాత్రి 12 గంటల సమయంలో పిజ్జా డెలివరీ చేస్తుండగా గన్తో ఫైర్ చేసినట్లు తెలుస్తోంది. అన్షుల్ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి వాసి అని సమాచారం.
నార్త్ ఈస్ట్ ఫిలడెల్ఫియాలోని ఒక ఖాళీ ఇంటికి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన కుంచ అన్షుల్ను దుండగులు కాల్చి చంపినట్లు తెలిపారు అక్కడి పోలీసులు. ఈ ఘటన ఎడ్జ్లీ స్ట్రీట్లోని 2300 బ్లాక్లో తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో జరిగిందని తెలిపారు. తలకి బుల్లెట్ గాయంతో అన్షుల్ కుప్పకూలినట్లు తెలిపారు పోలీసులు. అన్షుల్ను టెంపుల్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు నిర్దారించారని తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
Also Read
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
మృతుడు అత్యంత సన్నిహితుడు కిరణ్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘న్యూయార్క్ లో అన్షుల్ను దుండగులు తలపై కాల్పులు జరిపి హత్య చేశారు. మాకు 5వ తేదీన సమాచారం వచ్చింది. ఎమ్మెస్ పూర్తి చేసుకున్న అన్షు.. అమెరికా ఫిలతలపియలో పిజ్జా డెలివరీ బాయ్గా పార్ట్ టైం పనిచేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో హైదరాబాద్ వచ్చేవాడు. కానీ ఇంతలోనే దారుణ హత్యకు గురవడం బాదం కలిగిస్తుంది. రాత్రి 12 గంటలకు పిజ్జా డెలివరి చేస్తుండగా గన్నుతో ఫైర్ చేసి చంపార్ దుండగులు. గతంలో ఓసారి అమెరికాలో నల్లజాతీయులు అన్షుపై అటాక్ చేసి మొబైల్ ఫోన్, డబ్బులు దొంగతనం చేశారు. ఇప్పుడు ఏకంగా అతనిపై కాల్పులు జరిపి హత్య చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీలైనంత త్వరలో అన్షు మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చస్తున్నా. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి చాలామంది చనిపోతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంను సిరియస్గా తీసుకొని అమెరికా రాయబారితో మాట్లాడి భద్రత కల్పించాలి’ అని కోరాడు.
తాజావార్తలు
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!