Republic Day : రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేకంగా 41 మంది తెలంగాణ నుండి ఎంపిక
- ప్రధానమంత్రి యశస్వి స్కీమ్ - ఈ పథకం ద్వారా ఎంపికైనవారు 23 మంది
- టెక్స్టైల్స్ (హస్తకళలు) - 3 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు
- డబ్ల్యూసీడీ (వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్) - 5 మంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Republic Day : న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్కు తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 41 మందిని ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులను ఎంపిక చేసి, వారికి ఈ ఘనతను అందించింది. వీరు వివిధ రంగాలలో తమ ప్రతిభను చాటుకున్నారు మరియు ప్రభుత్వ పథకాలను సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఈ ప్రత్యేక అతిథుల ఎంపికతో గణతంత్ర దినోత్సవంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
తెలంగాణ నుండి ఎంపికైన అతిథులు
తెలంగాణ నుండి ఎంపికైన 41 మందిలో ప్రధానంగా వివిధ కేంద్ర పథకాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. ఈ ఎంపిక కేంద్ర రక్షణ శాఖ ద్వారా జరిగింది. ఈ అతిథుల ఢిల్లీ పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీరి కోసం నోడల్ అధికారులను కూడా నియమించారు. ఎంపికైన వారు కింది విధంగా వర్గీకరించారు:
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- ప్రధానమంత్రి యశస్వి స్కీమ్ – ఈ పథకం ద్వారా ఎంపికైనవారు 23 మంది.
- టెక్స్టైల్స్ (హస్తకళలు) – 3 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు.
- డబ్ల్యూసీడీ (వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్) – 5 మంది.
- రూరల్ డెవలప్మెంట్ విభాగం – గ్రామీణ అభివృద్ధి పథకాలను ఉపయోగించిన 12 మంది.
- పీఎం మత్స్య సంపద యోజన – 4 మంది.
- నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ విభాగం – ఈ విభాగంలో శిక్షణ పొందిన అత్యుత్తమ ట్రెయినీ శ్రావ్య ఎంపికయ్యారు.
- గిరిజన వ్యవహారాల విభాగం – 7 మంది.
- మన్ కీ బాత్ కార్యక్రమం – ఈ కార్యక్రమంలో పాల్గొన్న 15 మంది.
వీరు కేవలం పరేడ్ను వీక్షించడమే కాకుండా, దేశవ్యాప్తంగా వివిధ రంగాలలోని ప్రతిభావంతులుగా ప్రశంసలందుకుంటారు. వీరిని గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ పర్యటనతో వీరికి దేశభక్తి, స్ఫూర్తి కలిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు.
ఈ ఎంపికలో భాగంగా తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఎంపికైన లబ్ధిదారులందరూ ప్రభుత్వ పథకాలను సంపూర్ణంగా వినియోగించుకున్నవారు. పీఎం యశస్వి స్కీమ్, టెక్స్టైల్ హస్తకళల పథకాలు, గ్రామీణ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ వంటి విభాగాలు వారి జీవితాలను మార్చడంలో కీలక పాత్ర పోషించాయి.
రిపబ్లిక్ డే పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్ అంకం రాజేశ్వర్, పీఎం జన్మన్, మహ్మద్ ఖాదీర్ అహ్మద్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారుల గౌరవార్థం ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమాల్లో వీరిని సమర్పించడం దేశానికి గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ ప్రజలు తమ ప్రతిభను దేశవ్యాప్తంగా చాటుకున్నారు. ఈ ఎంపికలతో తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఒక మంచి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!