Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ చరిత్రలోనే కాకుండా, దేశంలోనే రికార్డు స్థాయిలో పంట పండిందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ధాన్యం తరలింపు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్ల కోసం సివిల్ సప్లై శాఖకు ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల ఆర్థిక వనరులను కల్పించిందని, అందులో ఇప్పటికే 4,800 కోట్ల రూపాయలను విడుదల చేశామని మంత్రి వివరించారు. వరి రెండు పంటలకు కలిపి రైతులకు సుమారు 45 వేల కోట్ల రూపాయలు అందుతున్నాయని పేర్కొన్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ సాధించిన స్థాయిలో కొనుగోళ్లు మరెక్కడా జరగలేదని ఆయన గుర్తు చేశారు.
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్ల విషయంలో మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం తూకంలో గానీ, మరే ఇతర కారణాలతో గానీ మిల్లర్లు కటింగ్ పెడితే సహించేది లేదని, అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని కూడా సకాలంలో చేరుకుంటున్నామని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!