Kavitha: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఖాతాలో ఒక మున్సిపాలిటీ చేరింది. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) పార్టీ ఘన విజయం సాధించింది. ఏఐఎఫ్బీ తరఫున పోటీ చేసిన కీలక అభ్యర్థి శ్రీను గత నెల రోజుల కింద మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత వెంట ఉన్నారు. ఆమెతో కలిసి పని చేశారు. అయితే.. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులకు గానూ.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 గెలుచుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒక్కో సీటు లభించింది. బీజేపీ, జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కవిత మద్దతుదారులు 8 వార్డులను కైవసం చేసుకోవడంతో ఆమె అకౌంట్లో ఒక మున్సిపాలిటీ చేరింది. ముందుగానే కవిత తమ పార్టీకి చెందిన అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరుపున పోటీ చేస్తారని కవిత ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీలో విభేధాల అనంతరం పార్టీ కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఒంటిరిగా మిగిలిపోయింది. ఈ విభేధాల అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఏకంగా ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ఆసక్తిగా మారింది.
READ MORE: Zaima Rahman: ట్రెండింగ్గా తారిక్ రెహమాన్ కుమార్తె.. బంగ్లాదేశ్ ఫలితాల్లో ఏ మ్యాజిక్ చేసిందంటే..!