Zaima Rahman: ట్రెండింగ్గా తారిక్ రెహమాన్ కుమార్తె.. బంగ్లాదేశ్ ఫలితాల్లో ఏ మ్యాజిక్ చేసిందంటే..!
- బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీ ప్రభంజనం
- ఏకపక్షంగా తారిక్ రెహమాన్ వైపు నిలబడ్డ ప్రజలు
- ట్రెండింగ్గా తారిక్ రెహమాన్ కుమార్తె జైమా
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఘన విజయం సాధించింది. 299 స్థానాలకు గాను 212 స్థానాలు కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత కుటుంబంతో కలిసి ఇటీవలే బంగ్లాదేశ్కు వచ్చారు. చాలా తక్కువ సమయంలోనే తారిక్ రెహమాన్ ఇంత పెద్ద విజయం సాధించడం హాట్ టాఫిక్ మారింది. ఇక ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో తారిక్ రెహమాన్ కుమార్తు జైమా జర్నాజ్ రెహమాన్ ట్రెండింగ్ మారింది. ఇంత భారీ స్థాయిలో ఫలితాలు రావడానికి కారణం జైమానే అని చెప్పుకొంటున్నారు.
జైమా జర్నాజ్..
జైమా జర్నాజ్.. తారిక్ రెహమాన్ దంపతులకు ఏకైక కుమార్తె. ప్రస్తుతం వయసు 28 ఏళ్లు. లండన్ క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయపట్టా పొందింది. నిన్నామొన్నటిదాకా ఆమె అంతగా పరిచయం లేని పేరు. కానీ బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. దీనింతటికి ఎన్నికల ప్రచారంలో తండ్రికి చేదోడు..వాదోడిగా దూసుకుపోవడమే కారణం.
Also Read
- Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
- US: ఖతార్లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!
- UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
- Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..

17 ఏళ్ల తర్వాత తారిక్ రెహమాన్ కుటుంబం లండన్ నుంచి ఢాకాకు ఇటీవలే వచ్చారు. ఇంతలోనే తల్లి, దివంగత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా చనిపోయారు. ఆ దు:ఖంలో ఉండగానే ఎన్నికలు వచ్చేశాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రచారంలోకి దిగిపోయారు. అంతే బంగ్లాదేశీయులను తమ వైపుకు తిప్పికున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానంటూ హామీ ఇవ్వడంతో ఏకపక్షంగా ప్రజలు మద్దతు తెలిపారు.

ఇక జైమా కూడా ఢాకాలో ప్రచారంలో దూసుకుపోయింది. తండ్రి తరపున ప్రచారం నిర్వహించింది. వీధుల్లో రిక్షా తొక్కుతూ ప్రజలను కలుస్తూ.. కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించింది. వీడియోలు, ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. యువ నాయకురాలి కావడంతో ప్రజలు బాగా ఆకర్షితులయ్యారు. ఖలీదా జియా తర్వాత కొత్త ముఖం కావడంతో బాగా ఎట్రాక్షన్గా నిలిచింది. పార్టీ సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంది. దాదాపు 30 మిలియన్లకు పైగా యువ ఓటర్లను ఆకట్టుకోగలింది. నాయనమ్మ ఖలీదా జియా జ్ఞాపకార్థం కవితలు, ఫొటోలు, భావోద్వేగ సంబంధాలను సోషల్ మీడియాలో పంచుకుంది. బాగా విపరీతంగా వైరల్ కావడంతో యువత బాగా ఆకర్షితులయ్యారు. చివరికి బీఎన్పీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
শারীরিক, মানসিক, বুদ্ধিবৃত্তিক প্রতিবন্ধীদের সাথে মতবিনিময় করেছেন জাইমা রহমান। #ZaimaRahman#Bangladesh pic.twitter.com/dd7NnwmlYu
— Masud Rana (@MasudRana137969) February 3, 2026
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!