Zaima Rahman: ట్రెండింగ్గా తారిక్ రెహమాన్ కుమార్తె.. బంగ్లాదేశ్ ఫలితాల్లో ఏ మ్యాజిక్ చేసిందంటే..!
- బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీ ప్రభంజనం
- ఏకపక్షంగా తారిక్ రెహమాన్ వైపు నిలబడ్డ ప్రజలు
- ట్రెండింగ్గా తారిక్ రెహమాన్ కుమార్తె జైమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఘన విజయం సాధించింది. 299 స్థానాలకు గాను 212 స్థానాలు కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత కుటుంబంతో కలిసి ఇటీవలే బంగ్లాదేశ్కు వచ్చారు. చాలా తక్కువ సమయంలోనే తారిక్ రెహమాన్ ఇంత పెద్ద విజయం సాధించడం హాట్ టాఫిక్ మారింది. ఇక ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో తారిక్ రెహమాన్ కుమార్తు జైమా జర్నాజ్ రెహమాన్ ట్రెండింగ్ మారింది. ఇంత భారీ స్థాయిలో ఫలితాలు రావడానికి కారణం జైమానే అని చెప్పుకొంటున్నారు.
జైమా జర్నాజ్..
జైమా జర్నాజ్.. తారిక్ రెహమాన్ దంపతులకు ఏకైక కుమార్తె. ప్రస్తుతం వయసు 28 ఏళ్లు. లండన్ క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయపట్టా పొందింది. నిన్నామొన్నటిదాకా ఆమె అంతగా పరిచయం లేని పేరు. కానీ బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. దీనింతటికి ఎన్నికల ప్రచారంలో తండ్రికి చేదోడు..వాదోడిగా దూసుకుపోవడమే కారణం.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!

17 ఏళ్ల తర్వాత తారిక్ రెహమాన్ కుటుంబం లండన్ నుంచి ఢాకాకు ఇటీవలే వచ్చారు. ఇంతలోనే తల్లి, దివంగత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా చనిపోయారు. ఆ దు:ఖంలో ఉండగానే ఎన్నికలు వచ్చేశాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రచారంలోకి దిగిపోయారు. అంతే బంగ్లాదేశీయులను తమ వైపుకు తిప్పికున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానంటూ హామీ ఇవ్వడంతో ఏకపక్షంగా ప్రజలు మద్దతు తెలిపారు.

ఇక జైమా కూడా ఢాకాలో ప్రచారంలో దూసుకుపోయింది. తండ్రి తరపున ప్రచారం నిర్వహించింది. వీధుల్లో రిక్షా తొక్కుతూ ప్రజలను కలుస్తూ.. కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించింది. వీడియోలు, ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. యువ నాయకురాలి కావడంతో ప్రజలు బాగా ఆకర్షితులయ్యారు. ఖలీదా జియా తర్వాత కొత్త ముఖం కావడంతో బాగా ఎట్రాక్షన్గా నిలిచింది. పార్టీ సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంది. దాదాపు 30 మిలియన్లకు పైగా యువ ఓటర్లను ఆకట్టుకోగలింది. నాయనమ్మ ఖలీదా జియా జ్ఞాపకార్థం కవితలు, ఫొటోలు, భావోద్వేగ సంబంధాలను సోషల్ మీడియాలో పంచుకుంది. బాగా విపరీతంగా వైరల్ కావడంతో యువత బాగా ఆకర్షితులయ్యారు. చివరికి బీఎన్పీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
শারীরিক, মানসিক, বুদ্ধিবৃত্তিক প্রতিবন্ধীদের সাথে মতবিনিময় করেছেন জাইমা রহমান। #ZaimaRahman#Bangladesh pic.twitter.com/dd7NnwmlYu
— Masud Rana (@MasudRana137969) February 3, 2026
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!