TG Inter Board: విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన…
- పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం
- మొదటి ఏడాది విద్యార్థుల పుస్తకాల ముద్రణ, పంపిణీ ప్రారంభం
- 2025 జూన్ మొదటి వారంలో పంపిణీ పూర్తి అవుతుందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపింది. మొదటి సంవత్సర విద్యార్థులకు తెలుగు అకాడమీ ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయిందని వెల్లడించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాల పంపిణీ ఇప్పటికే ప్రారంభం కాగా, 2025 జూన్ మొదటి వారంలో పంపిణీ పూర్తి అవుతుందని స్పష్టం చేసింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాల ముద్రణ తుది దశలో ఉందని పేర్కొంది. 2025 జూన్ మొదటి వారంలోపుగా ముద్రణ పూర్తవుతుందని.. 2024-25 సంవత్సరానికి వినియోగించగా మిగిలిన పుస్తకాలను అవసరమైన చోట్ల పంపిణీ చేస్తున్నామని తెలిపింది. జూన్ మధ్య నాటికి 100% పుస్తకాల పంపిణీ పూర్తి చేస్తామని.. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది.
READ MORE: Auto Driver: వాటే ఐడియా సర్జీ.. ఆ చిన్న పని చేస్తూ లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్..!
Also Read
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీలు సోమవారం తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది నుంచి విద్యా సంవత్సరం సమయాల్లో ఇంటర్ బోర్డు మార్పులు తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండగా ఈ ఏడాది ఏప్రిల్ 1నే ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు తరగతులు నిర్వహించి, ఆపై వేసవి సెలవులు ఇచ్చారు. తిరిగి 2025-26 విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుంది. ఈ సంవత్సరం నుంచే కొత్తగా ఎంబైపీసీ చదివే అవకాశం విద్యార్థులకు కల్పించారు.
READ MORE: RCB Victory Parade: బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ.. స్వాగతం పలికిన కర్ణాటక డిప్యూటీ సీఎం
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?