Ration Cards: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు: డిప్యూటీ సీఎం భట్టి
- రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి చేసేందుకు ప్రభుత్వం పెద్దపీట
- గ్రామ సభల్లో పథకాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి వంటి పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారికి ఇప్పుడు వెసులుబాటు కల్పిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో ఈ పథకాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణా రావు, మంత్రి దనసరి అనసూయ, ఇతర ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లతో సచివాలయం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పలు కీలక విషయాలు చర్చించారు.
Also Read: MEIL: తెలంగాణలో రూ.11 వేల కోట్ల పెట్టుబడులతో మెఘా ఇంజనీరింగ్ కీలక ఒప్పందాలు
Also Read
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
- RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
జనవరి 21 నుండి 24 వరకు గ్రామ సభలు కొనసాగనున్నాయి. ఈ సభలలో గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయబడతాయని, దాదాపు రూ. 40 వేల కోట్ల వ్యయం ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ రెండు పథకాలు గతంలో తొలగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పది సంవత్సరాల తరువాత ఈ పథకాలకు అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయని.. గ్రామ సభలలో ఇప్పటికే వచ్చిన దరఖాస్తుదారులలో ఇల్లు లేని వారు, ఇల్లు లేకున్నా స్థలం ఉన్నవారిని గుర్తించి జాబితా చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు.
Also Read: JEE Mains Exams: రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు..!
రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హులైన వారి జాబితాను త్వరలో విడుదల చేస్తామని, అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్హులైన వారిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. వీటి కోసం దరఖాస్తుదారుల పేరు, ఆధార్ నంబర్, చిరునామా, ఇంటి అడ్రస్ వంటి వివరాలను సేకరించాల్సిందిగా తెలిపారు. ముఖ్యంగా గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 4098 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించబడ్డాయని, అందుకు జిల్లా కలెక్టర్లను అభినందించారు. ఈ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.
తాజావార్తలు
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
-
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
-
Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?