Konda Surekha : అటవీ శాఖపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
- 2025-26 బడ్జెట్లో అటవీ అభివృద్ధికి ₹1,023 కోట్లు
- తెలంగాణలో అటవీ విస్తీర్ణం 33% పెంచే లక్ష్యం
- టైగర్ రిజర్వ్ల అభివృద్ధి, పర్యావరణ పర్యాటక ప్రోత్సాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha : అసెంబ్లీలో అటవీ శాఖపై మాట్లాడిన మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వం అటవీ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అడవులను సంరక్షించి, పచ్చదనం పెంచడం అత్యంత అవసరం అని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో అటవీ శాఖకు రూ.1,023 కోట్లను కేటాయించింది. అటవీ విస్తీర్ణాన్ని ప్రస్తుత 23% నుంచి 33% వరకు పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు ఆమె వెల్లడించారు. గత బీఆర్ఎస్ హయాంలో హరితహారం పేరుతో నిధుల దుర్వినియోగం జరిగిందని, కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రతి పైసాను సమర్థంగా వినియోగించేందుకు కంకణం కట్టుకుందన్నారు.
2024-25లో 20.02 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం, ఇప్పటివరకు 16.75 కోట్ల మొక్కలు (84%) నాటివేసినట్లు మంత్రి తెలిపారు. ఆర్భాటం, ప్రచారాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడానికే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో పచ్చదనం పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో “నగర్ వన యోజన” కింద రూ.18.09 కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ సహకారంతో ఖమ్మం జిల్లాలో కనకగిరి, వికారాబాద్లో అనంతగిరిలో పర్యావరణహిత పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కును “ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యం (PPP)” విధానంలో అభివృద్ధి చేస్తున్నారు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ నుంచి మొట్టమొదటిసారిగా రెండు గ్రామాలను విజయవంతంగా తరలించారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలివిడత తరలింపు పూర్తయింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి నాలుగు గ్రామాల తరలింపు పనులు కొనసాగుతున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ను మహారాష్ట్ర తడోబా టైగర్ రిజర్వ్తో కలిపే 1442.26 చదరపు కి.మీ అటవీ ప్రాంతాన్ని “కన్జర్వేషన్ రిజర్వ్”గా ప్రకటించేందుకు ప్రతిపాదనలు పంపారు.
వన్యప్రాణుల దాడులతో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణలకు గురైన 17,643.30 ఎకరాల అటవీ భూమిని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపు, అటవీ సంరక్షణ, పర్యావరణ అనుకూల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
Jupally Krishna Rao : తెలంగాణ పర్యాటక అభివృద్ధిపై మంత్రి జూపల్లి కీలక ప్రకటన
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!