Site icon NTV Telugu

Telangana Elections 2023: ప్రజలు మార్పు రావాలని ఓటు వేస్తున్నారు: అజారుద్దీన్

Mohammed Azharuddin

Mohammed Azharuddin

Mohammed Azharuddin Cast His Vote: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్‌ జరుగుతోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు మొదలవగా.. తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు అందరూ ఉదయమే ఓటేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థి మహ్మద్ అజారుద్ధీన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజారుద్ధీన్‌ కుమారుడు అసదుద్దీన్ కూడా ఓటేశారు.

Also Read: Telangana Elections 2023: ఓటు హక్కు వినియోగించుకున్న వెంకటేష్‌, చిరంజీవి!

ఓటేసిన అనంతరం మహ్మద్ అజారుద్ధీన్‌ ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు రావాలని ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో మార్పు రావాలని ప్రజలు ఓటు వేస్తున్నారు. తెలంగాణ పౌరులందరూ ఈరోజు భారీ సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ అభివృద్ధి, పురోగతి కోసం మీ ఓటు వేయండి’ అని అజారుద్ధీన్‌ కోరారు.

Exit mobile version