CM Revanth Reddy : దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర
- డిఫెన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర
- హైదరాబాద్ను రక్షణ పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి డిఫెన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు తెలంగాణ రాష్ట్రం ఎంతో సహకారం అందిస్తోందని, ఇప్పటికే హైదరాబాద్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, విభాగాలకు కేంద్రంగా మారిందని వెల్లడించారు.
తెలంగాణలో డిఫెన్స్ పరిశ్రమలు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయని, సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా లక్షలాది మంది యువతకు అవగాహన కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రక్షణ పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణను కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
Also Read
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
- Google Mapsలో సూపర్ అప్డేట్.. హోటల్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ ఒకేచోట
సాంప్రదాయ ఇంజనీరింగ్తో పాటు రక్షణ పరిశ్రమల అభివృద్ధికి డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ భద్రతను పరిరక్షించడం ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉందో యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రక్షణ పరిశ్రమల్లో పనిచేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దేశ సేవలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.
మిస్సైల్స్ తయారీ పరిశ్రమలు అయిన డీఆర్డీఏల్, బీడీఎల్, డీఆర్డీవో, మిధానీ లాంటి సంస్థలు తెలంగాణలోనే ఉండటం గర్వించదగిన విషయం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బెంగళూరులో ఉన్న రక్షణ పరిశోధన, తయారీ పరిశ్రమల మాదిరిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ పరిశ్రమల కారిడార్లను అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
రక్షణ శాఖ దేశ భద్రతను కాపాడటంలో కీలక భూమిక పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు. అదేవిధంగా దేశ భద్రత భవిష్యత్తు యువతపై ఆధారపడిందని, వారు మరింత చైతన్యంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా యువతకు భారత త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) గురించి అవగాహన కల్పిస్తామని తెలిపారు.
హైదరాబాద్లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ డిఫెన్స్ ఎగ్జిబిషన్లో దేశ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రదర్శించనున్నారు. రక్షణ రంగంలో భారతదేశం అభివృద్ధి చేసిన పరికరాలు, ఆయుధ వ్యవస్థలు, మిస్సైల్స్, సాంకేతిక పరిజ్ఞానం ఈ ప్రదర్శనలో ప్రాముఖ్యత పొందనున్నాయి. త్రివిధ దళాల గురించి విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించేందుకు రక్షణ శాఖ ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రదర్శన ద్వారా దేశ భద్రతకు సంబంధించి యువతలో అవగాహన పెంపొందించడంతో పాటు, రక్షణ రంగంలో అభిరుచి కలిగిన వారికి ఉపాధి అవకాశాల గురించి స్పష్టత లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ పరిశ్రమల అభివృద్ధి ఎంతో అవసరమని, తెలంగాణ ఈ మార్గంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
IND vs NZ: ఇండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ రోహిత్ ఔట్..!
తాజావార్తలు
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్లకు గుడ్న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
-
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
-
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!