తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి… తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 220 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 244 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,66, 183 కు చేరగా… రికవరీ కేసులు 6,57, 665 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3919 కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,599 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఒకే రోజు 46, 193 శాంపిల్స్ పరీక్షించినట్టు బులెటిన్లో పేర్కొన్నారు.