Minister Seethakka : ‘ఆపరేషన్ కగార్’ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
- ఆపరేషన్ కగార్ భయం.. గిరిజనుల జీవితం ప్రశ్నార్థకం
- మావోయిస్టుల కంటే భద్రతా దళాలే బెడదగా మారారు
- శాంతి చర్చలే మార్గం.. కాదు కాల్పుల.. కేంద్రానికి మంత్రి సీతక్క హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఆపరేషన్ కగార్’పై కేంద్ర ప్రభుత్వం తన పట్టును కొనసాగిస్తూ, 20వేల మంది భద్రతా సిబ్బందితో కర్రిగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులను పట్టుకునేందుకు గట్టి పోరాటం చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా, సీఆర్పీఎఫ్ (CRPF) దళాలు బుధవారం కర్రిగుట్టపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. అయితే, అక్కడ పర్మినెంట్ బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం భద్రతా దళాలు సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం, కర్రిగుట్ట పరిధిలోని దోబికొండ, నీలం సరాయి గుట్టలు పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలోకి వచ్చాయని అధికారులు తెలిపారు.
YS.Jagan: ప్రధాని సభకు రావాలంటూ జగన్కు ఆహ్వానపత్రిక.. పీఏకు ఇచ్చి వెళ్లిన అధికారులు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇలాంటి సమయంలో, కూంబింగ్ ఆపరేషన్లు కారణంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ మంత్రి సీతక్క ఈ అంశంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ విషయంలో రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు. కర్రిగుట్టలో కేంద్ర బలగాల ఆంక్షలతో అక్కడి ఆదివాసీల జీవితం ప్రశ్నార్థకమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు తమ జీవనాధారాన్ని కోల్పోతుండగా, వారి కుటుంబాలు అస్తవ్యస్త పరిస్థితుల్లో చిక్కుకున్నాయని ఫైర్ అయ్యారు. అలాగే, రాత్రింబవళ్లు కాల్పులు గిరిజనులను భయభ్రాంతులకు లోనుచేస్తున్నాయని, ఈ ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని మంత్రి సీతక్క కోరారు. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీల జీవనాధారానికి అడ్డంకి లేకుండా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!