TG Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగులకు, మహిళలకు గుడ్ న్యూస్
- ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఐదు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీ
- ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీ సుమారు ఐదు గంటల పాటు సాగింది. రాష్ట్ర అభివృద్ధితో పాటు, ప్రజల సంక్షేమంపై దృష్టి సారించిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ (డియర్నెస్ అలౌయెన్స్) ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది. విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
TPCC Mahesh Goud : మల్లు రవిపై ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తాం
Also Read
హైదరాబాద్ మెట్రో రైల్వే రెండో దశ విస్తరణపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. నగర అభివృద్ధికి మెట్రో సేవలు మరింత విస్తరించాలని భావించిన కేబినెట్, సంబంధిత ప్రణాళికలపై చర్చలు జరిపింది. ములుగు జిల్లా ఇంచర్లలో ఏర్పడనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ప్రమాద బీమా మరియు లోన్ బీమా చెల్లింపుల కోసం రూ.70 కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మహిళా బృందాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల ఆధునీకరణను ‘హమ్ విధానం’ ద్వారా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజల అవసరాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
Sudhakar Naidu: టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రలో ట్విస్ట్…!
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!