Ponnam Prabhakar : మైనార్టీలను అడ్డుపెట్టి తప్పించుకోలేరు
- బీసీ రిజర్వేషన్ బిల్లు – ముఖ్యమైన అంశం
- ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం – మహిళల అవసరాలే కీలకం
- బీసీ లలో మైనారిటీల చేర్పు – బీజేపీపై విమర్శలు
- రైతులు, పంటల సమస్యలపై బీఆర్ఎస్పై ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, మైనార్టీల స్థానం, విద్యుత్ సబ్సిడీలు, రైతుల సంక్షేమం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు రాజకీయంగా ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% గా ప్రకటించడం రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగినదని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా ఈ బిల్లును తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే, EWS రిజర్వేషన్లు 50% పైగా ఉండగా, బీసీ రిజర్వేషన్ ఆగుతుందనే మాట తప్పుడు ప్రచారం మాత్రమే అని స్పష్టం చేశారు.
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
“బీసీ జనాభా లెక్కలు చక్కగా నిర్వహించేందుకు డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేశాం. అన్ని అంశాలను చట్టబద్ధంగా అమలు చేస్తున్నాం” అని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై మాట్లాడిన ఆయన, “మహిళలు అవసరమైతేనే బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సబ్సిడీ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారమేమీ కలుగదు” అని పేర్కొన్నారు. 200 యూనిట్ల విద్యుత్ ఉచిత పథకం పేదలకు ఎంతో మేలు చేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ చెల్లింపులో పేదలపై ఉన్న భారాన్ని ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు.
“బీజేపీ నాయకులు మైనారిటీలను బీసీలలో చేర్చారని విమర్శలు చేస్తున్నారు. కానీ, అదే బీజేపీ ఏపీలో అధికారంలో ఉంది. అక్కడ ఎందుకు మైనారిటీలను బీసీల్లో చేర్చారు?” అని ప్రశ్నించారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు నిరాధారమైనవని మంత్రి అభిప్రాయపడ్డారు. “ప్రభుత్వం తరపున మేము ప్రధానిని అపాయింట్మెంట్ కోరాము. కానీ బీజేపీ నేతలు మమ్మల్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమదే” అని అన్నారు.
తెలంగాణ రైతుల సమస్యల గురించి మాట్లాడిన మంత్రి, “పంటలు ఎండిపోతే బీఆర్ఎస్ నేతలు సంతోషపడుతున్నారు” అని ఆరోపించారు. అన్ని ప్రాజెక్టుల కింద నీటిని అందించగలగడం సాధ్యం కాదని, రైతులకు అనుకూలంగా పనిచేయడానికి ప్రభుత్వ విధానాలు మారుతున్నాయని తెలిపారు.
“42% బీసీ రిజర్వేషన్ మొదటి అడుగు. రెండో అడుగు బీసీ సబ్ ప్లాన్ – దాని కోసం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశాం” అని వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న “మిస్ ఇండియా” అందాల పోటీకి 250 కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తోందని వస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. “ప్రభుత్వం నుండి డబ్బులు అందాల పోటీకి ఖర్చు చేయడం లేదు. అసలు కేటీఆర్ లాంటి అందగాడు ఉన్న రాష్ట్రంలో అందాల పోటీలు ఎందుకు?” అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేటీఆర్పై మరింతగా విమర్శలు గుప్పిస్తూ, “ఫార్ములా ఈ రేసింగ్కి, అందాల పోటీకి పోలికలా? కేటీఆర్కి అసలు ఈ విషయాలు తెలుసా?” అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!