NTV Telugu Site icon

Telangana Assembly : తెలంగాణ పరిశ్రమల అభివృద్ధిపై అసెంబ్లీలో వేడివేడి చర్చ

Sridhar Babu

Sridhar Babu

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో తీవ్ర రాజకీయ వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో తపమంటున్నాయని మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వంపై అవరోధాలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనపై శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఆ ఘటన వెనుక బీఆర్ఎస్ నేతలే ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టి భూసేకరణను అడ్డుకున్నారని అన్నారు. ఫార్మా పరిశ్రమల ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయని తెలిసినా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు ప్రతిపక్షాలు అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంపై ప్రతిపక్ష కుట్ర?
కాంగ్రెస్ హయాంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుతున్నామని, అయితే ప్రతిపక్షాలు ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించడం విడ్డూరంగా ఉందని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కుదరకుండా ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఫార్మాసిటీపై కోమటిరెడ్డి ఘాటు విమర్శలు
అసెంబ్లీలో మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ అంశంపై స్పందిస్తూ, బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఒకేచోట 144 ఫార్మా కంపెనీలను స్థాపిస్తామని చెప్పిన బీఆర్ఎస్, ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. అయితే అప్పటి ప్రతిపక్ష నేతలుగా తాము ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేయలేదని కూడా ఆయన స్పష్టంగా తెలిపారు.

RBI: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కు ఆర్బీఐ షాక్.. రూ. 75 లక్షల జరిమానా.. ఎందుకంటే?