Cyber Crime: ఐటీ ఉద్యోగిని మోసం చేసిన నేరగాళ్లు.. రూ.71.82 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: దేశంలో సైబర్ క్రైమ్ మోసాలు ఎప్పటికప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ మోసాల గురించి నిత్యం ప్రజలను హెచ్చరించినా.. ప్రతీ రోజు అలాంటి వాటికి బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం సైబర్ క్రైమ్స్ గురించి హెచ్చరిస్తుంటే.. మోసగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. బహుళజాతి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 35 ఏళ్ల మహిళ సైబర్ మోసానికి గురై రూ.71.82 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన సెప్టెంబర్ 2 నుంచి 15వ తేదీ మధ్య జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Also Read: Petrol-Diesel Sales: తగ్గిన డీజిల్ వినియోగం..పెరిగిన పెట్రోల్!
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
హింజేవాడిలోని కోహిన్నోర్ కోరెల్కు చెందిన బాధితురాలు అమ్రపాలి చంద్రశేఖర్ కులతే అనే ఐటీ ఉద్యోగిని ఆన్లైన్లో టాస్క్ పేరుతో సంప్రదించి మోసం చేశారు. ప్రారంభంలో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సందేశాన్ని అందుకుంది. దీనిలో ఒక మోసగాడు రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన రివ్యూలను రాయమని అడిగాడు. ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. టాస్క్ పూర్తయిన తర్వాత ఆమె చెల్లింపు కోసం అడుగుతున్నప్పుడు మంచి రాబడిని సంపాదించడానికి ‘కాయిన్ స్విచ్’ ప్లాట్ఫారమ్లో సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టమని నిందితుడు ఆమెను ఒప్పించాడు.
Also Read: Pak Miss Universe: వివాదాల్లో మిస్ యూనివర్స్ పాకిస్తాన్ ఎరికా రాబిన్.. ప్రభుత్వం విచారణకు ఆదేశం
వారిని నమ్మి, బాధితురాలు సైబర్ నేరగాళ్లతో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. వారు ఆమెను పూర్తిగా నమ్మించారు. రెండు వారాల్లో మోసగాళ్లు అందించిన వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తూ, మొత్తం 21 లావాదేవీలు చేసింది. అనంతరం తన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడగడంతో వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆమె మోసపోయినట్లు గ్రహించింది. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. మొత్తం ఆమె రూ. 71.82 లక్షలు వారి ఖాతాల్లో జమ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. హింజేవాడి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!