Cyber Crime: ఐటీ ఉద్యోగిని మోసం చేసిన నేరగాళ్లు.. రూ.71.82 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: దేశంలో సైబర్ క్రైమ్ మోసాలు ఎప్పటికప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ మోసాల గురించి నిత్యం ప్రజలను హెచ్చరించినా.. ప్రతీ రోజు అలాంటి వాటికి బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం సైబర్ క్రైమ్స్ గురించి హెచ్చరిస్తుంటే.. మోసగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. బహుళజాతి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 35 ఏళ్ల మహిళ సైబర్ మోసానికి గురై రూ.71.82 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన సెప్టెంబర్ 2 నుంచి 15వ తేదీ మధ్య జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Also Read: Petrol-Diesel Sales: తగ్గిన డీజిల్ వినియోగం..పెరిగిన పెట్రోల్!
Also Read
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
హింజేవాడిలోని కోహిన్నోర్ కోరెల్కు చెందిన బాధితురాలు అమ్రపాలి చంద్రశేఖర్ కులతే అనే ఐటీ ఉద్యోగిని ఆన్లైన్లో టాస్క్ పేరుతో సంప్రదించి మోసం చేశారు. ప్రారంభంలో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సందేశాన్ని అందుకుంది. దీనిలో ఒక మోసగాడు రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన రివ్యూలను రాయమని అడిగాడు. ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. టాస్క్ పూర్తయిన తర్వాత ఆమె చెల్లింపు కోసం అడుగుతున్నప్పుడు మంచి రాబడిని సంపాదించడానికి ‘కాయిన్ స్విచ్’ ప్లాట్ఫారమ్లో సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టమని నిందితుడు ఆమెను ఒప్పించాడు.
Also Read: Pak Miss Universe: వివాదాల్లో మిస్ యూనివర్స్ పాకిస్తాన్ ఎరికా రాబిన్.. ప్రభుత్వం విచారణకు ఆదేశం
వారిని నమ్మి, బాధితురాలు సైబర్ నేరగాళ్లతో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. వారు ఆమెను పూర్తిగా నమ్మించారు. రెండు వారాల్లో మోసగాళ్లు అందించిన వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తూ, మొత్తం 21 లావాదేవీలు చేసింది. అనంతరం తన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడగడంతో వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆమె మోసపోయినట్లు గ్రహించింది. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. మొత్తం ఆమె రూ. 71.82 లక్షలు వారి ఖాతాల్లో జమ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. హింజేవాడి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!