Cyber Crime: ఐటీ ఉద్యోగిని మోసం చేసిన నేరగాళ్లు.. రూ.71.82 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: దేశంలో సైబర్ క్రైమ్ మోసాలు ఎప్పటికప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ మోసాల గురించి నిత్యం ప్రజలను హెచ్చరించినా.. ప్రతీ రోజు అలాంటి వాటికి బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం సైబర్ క్రైమ్స్ గురించి హెచ్చరిస్తుంటే.. మోసగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. బహుళజాతి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 35 ఏళ్ల మహిళ సైబర్ మోసానికి గురై రూ.71.82 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన సెప్టెంబర్ 2 నుంచి 15వ తేదీ మధ్య జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Also Read: Petrol-Diesel Sales: తగ్గిన డీజిల్ వినియోగం..పెరిగిన పెట్రోల్!
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
హింజేవాడిలోని కోహిన్నోర్ కోరెల్కు చెందిన బాధితురాలు అమ్రపాలి చంద్రశేఖర్ కులతే అనే ఐటీ ఉద్యోగిని ఆన్లైన్లో టాస్క్ పేరుతో సంప్రదించి మోసం చేశారు. ప్రారంభంలో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సందేశాన్ని అందుకుంది. దీనిలో ఒక మోసగాడు రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన రివ్యూలను రాయమని అడిగాడు. ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. టాస్క్ పూర్తయిన తర్వాత ఆమె చెల్లింపు కోసం అడుగుతున్నప్పుడు మంచి రాబడిని సంపాదించడానికి ‘కాయిన్ స్విచ్’ ప్లాట్ఫారమ్లో సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టమని నిందితుడు ఆమెను ఒప్పించాడు.
Also Read: Pak Miss Universe: వివాదాల్లో మిస్ యూనివర్స్ పాకిస్తాన్ ఎరికా రాబిన్.. ప్రభుత్వం విచారణకు ఆదేశం
వారిని నమ్మి, బాధితురాలు సైబర్ నేరగాళ్లతో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. వారు ఆమెను పూర్తిగా నమ్మించారు. రెండు వారాల్లో మోసగాళ్లు అందించిన వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తూ, మొత్తం 21 లావాదేవీలు చేసింది. అనంతరం తన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడగడంతో వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆమె మోసపోయినట్లు గ్రహించింది. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. మొత్తం ఆమె రూ. 71.82 లక్షలు వారి ఖాతాల్లో జమ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. హింజేవాడి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!