Virat Kohli : కోహ్లీకి చేరువలో మూడు రికార్డులు.. వన్డే సిరీస్ కి రెడీ.. ?
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన శతకంతో చెలరేగింది. ఈ క్రమంలో ఇప్పుడు వన్డే సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. అయితే ఈ సిరీస్ లో అతడు కొన్ని రికార్డులు అందుకునే అవకాశం ఉంది. అదేంటంటే.. అహ్మదాబాద్ టెస్టులో మంచి ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న విరాట్.. వన్డే సిరీస్ లో కూడా అలాగే ఆడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆస్ట్రేలియా అత్యధికంగా ఈ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ రెండో స్థానంలో నిలుస్తాడు.
Also Read : Kunamneni Sambasiva Rao: బీజేపీతోనే దేశానికి ప్రమాదం.. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి
Also Read
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
- Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో అందుకున్న అవార్డు.. ఆసీస్ పై కోహ్లీకి తొమ్మిదోది. ఇంకొక్క అవార్డును అతడు అందుకుంటే వివ్ రిచర్ట్స్, ఇయాన్ బోథమ్ తో సమానంగా పది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో రెండో స్థానంలో నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. అతడూ ఆసీస్ పై ఏకంగా 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.
Also Read : Record-Low Weddings: 30 దాటినా పెళ్లికి నో నో.. రికార్డు స్థాయిలో పడిపోయిన మ్యారేజ్లు..!
ఇకపోతే ఆస్ట్రేలియాపై చెలరేగిపోయే బ్లాటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు.. అయితే జరగబోయే వన్డే సిరీస్ లో అతడు మరో సెంచరీ చేస్తే కంగారులపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డరకెక్కుతాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో బాదిన శతకం కోహ్లీకి అంతర్జాతీయ కెరీర్ లో 75వది. వీటిలో 16 శతకాలు ఆసీస్ పై కొట్టినవే. ఇక వన్డేల్లో ఆసీస్ పై కోహ్లీ 8 సెంచరీలు చేశాడు. ఇక జరగబోయే ఈ మూడు వన్డేలలో ఒక్క సెంచరీ చేస్తే.. ఆసీస్ పై అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్ గా సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేస్తాడు. లేదంటే అధిగమించే అవకాశం ఉంటుంది.
Also Read : Acid Attack : టీ ఇవ్వలేదని భార్యపై యాసిడ్ పోసిన భర్త
ఇంకా ఆసీస్ తో జరగబోయే వన్డే సిరీస్ లో మరో మైలురాయిని కూడా విరాట్ కోహ్లీ చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి విరాట్ అతి దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ 262 వన్డే ఇన్నింగ్స్ ల్లో 12 వేల 809 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇక తాజా సిరీస్ లో మరో 191 పరుగుల చేస్తే.. 13 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ రికార్డును సాధించిన ప్లేయర్ గా కోహ్లీ నిలిచే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!