INDvsAUS Test: అది ఆస్ట్రేలియా మైండ్గేమ్.. స్మిత్కు అశ్విన్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైండ్ గేమ్స్, స్లెడ్జింగ్కు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ పెట్టింది పేరు. ఆటతోపాటు నోటికి పని చెప్పి గెలవడం కంగారూలకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఓ సిరీస్ ప్రారంభానికి ముందు ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయడానికి వాళ్లు ఏవోవో కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆ టీమ్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా ఇండియాలో ఎందుకు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదనడానికి ఓ వింత కారణం చెప్పాడు. చివరి పర్యటనలో తమకు పేస్ పిచ్పై ప్రాక్టీస్ మ్యాచ్ ఏర్పాటు చేశారని, అసలు మ్యాచ్లో ఉండే పిచ్లకు దీనికి సంబంధం లేకుండా ఉందని, అందుకే తాము ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా తమ సొంతంగా స్పిన్ పిచ్లపై ప్రాక్టీస్ చేస్తున్నట్లు స్మిత్ చెప్పాడు. అయితే దీనికి తాజాగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు.
Also Read: Deepak Chahar Wife: దీపక్ చాహర్ భార్యను మోసం చేసిన వ్యక్తులు..రూ.10లక్షల కోసం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
“ఆస్ట్రేలియా ఈసారి వార్మప్ మ్యాచ్లు ఆడటం లేదు. అయితే ఇదేమీ కొత్త కాదు. ఇండియా కూడా కొన్ని విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్ గేమ్స్ ఆడదు. టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ చాలా బిజీగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. 2017లో తొలి టెస్ట్లో ఎదురైన పిచ్కు భిన్నంగా బ్రబౌర్న్లో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం పచ్చిక ఉన్న పిచ్ ఇచ్చారని స్మిత్ అన్నాడు. నిజానికి పుణెలో చాలా టర్న్ ఉన్న పిచ్ అది. వాళ్లకు పచ్చిక ఉన్న పిచ్ ఇచ్చి ఉండొచ్చు. కానీ దానికోసం ఎవరూ ప్రత్యేకంగా ప్లాన్ చేయరు. అయినా ఓ సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు ఇలా మైండ్ గేమ్స్ ఆడటం, స్లెడ్జింగ్ చేయడం అలవాటు. వాళ్లు దానిని ఇష్టపడతారు. అది వాళ్ల క్రికెట్ ఆడే స్టైల్” అని అశ్విన్ అన్నాడు.
Also Read: INDvsAUS: ఆసీస్తో టెస్టు సిరీస్.. నెట్స్లో చెమటోడుస్తున్న టీమిండియా
ఈసారి కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇండియా వచ్చిన ఆస్ట్రేలియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా నేరుగా సిరీస్ బరిలోకి దిగుతోంది. బెంగళూరు దగ్గరలోని ఆలూర్లో ప్రత్యేకంగా స్పిన్ పిచ్లను ఏర్పాటు చేయించుకొని మరీ ప్రాక్టీస్ చేస్తోంది. అంతేకాదు అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేష్ పితియా అనే స్పిన్ బౌలర్ను పిలిపించి అతని బౌలింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నాలుగు టెస్టుల సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!