IND vs NZ: 34 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా..
- 34 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
- 4.64 రన్ రేట్తో 450 కంటే ఎక్కువ వేగంతో స్కోర్ చేసిన భారత్
- 1990లో న్యూజిలాండ్పై 4.61 రన్ రేట్తో 482 పరుగులు చేసిన ఇండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెంగళూరులో తొలి మ్యాచ్ జరుగుతోంది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మధ్య 177 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో.. భారత జట్టు మొదటి టెస్ట్ నాలుగో రోజు మ్యాచ్పై పట్టు బిగించింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లు 54 పరుగులకు ఏడు వికెట్లు తీసి అద్భుతంగా పునరాగమనం చేశారు. కొత్త బంతితో టీమిండియా పరుగులు చేయడంలో విఫలం కాగా.. వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. మరోవైపు.. మ్యాచ్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కేవలం 46 పరుగులు చేసింది. ఇది స్వదేశంలో టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యల్ప స్కోరు. అయితే.. భారత్ రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పునరాగమనం చేసింది. 4.64 రన్ రేట్తో 450 కంటే ఎక్కువ వేగంతో స్కోర్ చేసింది.
KCR Trailer: మరో బలగం లోడింగ్ లా ఉందే!
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
న్యూజిలాండ్తో జరిగిన తొలి ఇన్నింగ్స్లో భారత్ 46 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన చేసిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో అద్భుత ప్రదర్శన చేశారు. రోహిత్-యశస్విలు జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ మధ్య 136 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. సర్ఫరాజ్, పంత్ నాలుగో వికెట్కు 177 పరుగులు చేశారు. భారత్ టెస్టుల్లో అత్యంత వేగంగా 450కి పైగా స్కోరు సాధించిన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్లో భారత్ 4.64 రన్ రేట్తో 99.3 ఓవర్లలో 462 పరుగులు చేసింది. అంతకుముందు 1990లో న్యూజిలాండ్పై ఆక్లాండ్లో భారత్ 4.61 రన్ రేట్తో 482 పరుగులు చేసింది.
Remo DSouza: షాకింగ్: మరో డ్యాన్స్ కొరియోగ్రాఫర్పై కేసు
అంతకుముందు 2018 బెంగళూరులో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 4.52 రన్ రేట్తో 474 పరుగులు చేసింది. కాగా.. న్యూజిలాండ్ ముందు 107 పరుగుల విజయలక్ష్యం ఉంది. ఈ టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధిస్తే.. 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్లో టెస్టులో గెలిచిన వారు అవుతారు. న్యూజిలాండ్ చివరిసారిగా భారత్లో 1989లో ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది.
450 కంటే ఎక్కువ స్కోర్లలో భారత్కు అత్యధిక రన్ రేట్
4.64 – 462 (99.3) vs న్యూజిలాండ్, బెంగళూరు, 2024
4.61 – 482 (104.3) vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 1990
4.58 – 495 (108) vs వెస్టిండీస్, ముంబై ప్రపంచ కప్, 2013
4.52 – 474 (104.5) vs ఆఫ్ఘనిస్తాన్, బెంగళూరు, 2018
4.50 – 600 (133.1) vs శ్రీలంక, గాలె, 2017
తాజావార్తలు
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?