U19 World Cup 2024: ఫైనల్లోకి అడుగుపెట్టిన టీమిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. సెమీస్లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో.. ఉదయ్ సహారన్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్కు చేరుకుంది. కాగా.. ఈనెల 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే.. పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య సెమీస్ మ్యాచ్ జరిగితే, ఆ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది ఫైనల్ కు చేరుకుంటుంది. ఫైనల్లో ప్రత్యర్థి జట్టును పాకిస్తాన్ ను ఓడించినా.. ఆస్ట్రేలియాను ఓడించినా భారత్ రివేంజ్ తీసుకున్నట్లు అవుతుంది.
సెమీస్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ముందు 245 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో సచిన్ దాస్ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేశాడు. సచిన్ దాస్ 95 బంతుల్లో 96 పరుగులు చేశాడు. దాంతోపాటు.. టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ 124 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఉదయ్ సహారన్, సచిన్ దాస్ మధ్య 171 పరుగుల భాగస్వామ్యం ఉంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
AP Budget 2024: రేపు ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ఉదయం 8 గంటలకే కేబినెట్ సమావేశం
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే దెబ్బతగిలింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత అర్షిన్ కులకర్ణి 12 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అద్భుత ఫామ్లో ఉన్న ముషీర్ ఖాన్ 4 పరుగులు మాత్రమే చేశాడు. ప్రియాంషు మోలియా 5 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. భారత జట్టు 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ ఉదయ్ సహారన్, సచిన్ దాస్ కలిసి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చారు.
దక్షిణాఫ్రికా తరఫున ట్రిస్టన్ లూస్, మేనా ఫకా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్.. కెప్టెన్ ఉదయ్ సహారన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున ఓపెనర్ జువాన్ డ్రే ప్రిటోరియస్ 102 బంతుల్లో 76 పరుగుల అత్యధిక స్కోరు సాధించాడు. ఆ తర్వాత రిచర్డ్ సెలెస్వీన్ 100 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇక.. భారత్ బౌలింగ్ లో రాజ్ లింబానీ 3 వికెట్లు పడగొట్టాడు. ముషీర్ ఖాన్ 2.. నమన్ తివారీ, సౌమీ పాండేకు చెరో వికెట్ దక్కింది.
Donald Trump: ట్రంప్కి యూఎస్ కోర్ట్ షాక్.. విచారణ నుంచి మినహాయింపు లేదని తీర్పు..
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!