B.Tech Student Suicide: ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
B.Tech Student Suicide: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద గైట్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్నేహితులతో అద్దెకు నివాసం ఉంటున్న గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని జయశ్రీ(19) అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గైట్ కళాశాలకు వెళ్లిన స్నేహితులు తిరిగి రూమ్కు వచ్చేసరికి ఉరేసుకున్నట్లు యువతి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ విద్యార్థినిని విశాఖపట్నంలోని త్రినాధపురం గ్రామానికి చెందిన గురివల్లి జయశ్రీగా పోలీసులు గుర్తించారు. అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో మృతురాలు వెల్లడించినట్లు దర్యాప్తులో పోలీసులు తెలిపారు.
Also Read: Minister Prashanth Reddy: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం
Also Read
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
విశాఖపట్నంలోని త్రినాథపురానికి చెందిన గురివల్లి జయశ్రీ(19) అనే ఓ కళాశాల విద్యార్థిని అనారోగ్య కారణాలతో బుధవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్టు బొమ్మూరు ఎస్సై జగన్మోహనరావు వెల్లడించారు. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం.. గైట్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న జయశ్రీ దివాన్చెరువులోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటోంది. అయితే విశాఖపట్నంలోని అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చూపించుకుని వారం రోజుల కిందట దివాన్చెరువుకు జయశ్రీ తిరిగి వచ్చింది. గత వారం రోజుల్లో ఒకరోజు మాత్రమే జయశ్రీ కళాశాలకు వెళ్లింది. బుధవారం తన గదిలో ఉన్న జయశ్రీ తన స్నేహితులు కళాశాలకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందని ఎస్సై వెల్లడించారు.
చనిపోయే ముందు తన తమ్ముడిని ఉద్దేశించి లేఖ రాసిందని పోలీసులు వెల్లడించారు. ఆ లేఖలో..”అమ్మ మనకోసం చాలా కష్టపడుతుండడం చూడలేకపోతున్నా. నా ఆరోగ్యం కూడా బాగోవడం లేదు. నువ్వు బాగా చదువుకుని అమ్మను బాగా చూసుకోవాలి” అని రాసింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జగన్మోహనరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
-
US-Iran War: ‘ట్రంప్ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
-
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
-
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!