Ind vs Pak: పాక్పై 6 పరుగుల తేడాతో గెలిచిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలిచింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆలస్యంగా స్టార్టైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. పాక్ పేసర్ల ధాటికి 19 ఓవర్లలో కేవలం 119 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు తీసుకోగా, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ తీసుకున్నారు. ఇక, భారత ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) మినహా అందరూ ఫెయిల్ అయ్యారు.
Read Also: Jammu Kashmir : యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడిని ఖండించిన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!
- NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
- Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
- Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ (12), హార్దిక్ పాండ్యా (12), అక్షర్ పటేల్ (20) రెండంకెల స్కోర్ చేయగా.. విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబే (3), రవీంద్ర జడేజా (0), అర్ష్దీప్ సింగ్ (9), బుమ్రా (0) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమైయ్యారు. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేసి ఓడిపోయింది. బుమ్రా (4-0-14-3), హార్దిక్ (4-0-24-2), సిరాజ్ (4-0-19-0), అర్ష్దీప్ సింగ్ (4-0-31-1), అక్షర్ పటేల్ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఓటమిని శాసించారు.
Read Also: Premgi Marriage: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ కమెడియన్!
అయితే, పాకిస్తాన్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 18 రన్స్ చేయాల్సి ఉంది.. అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 రన్స్ ఇచ్చాడు. అంతకు ముందు ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేసి కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. ఈ గెలుపుతో భారత్ ప్రపంచకప్ టోర్నమెంట్లో పాక్పై తమ రికార్డును 7-1కి పదిలంగా ఉంచుకుంది. పాక్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ రిజ్వాన్ (31) ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. ఈ ఓటమితో పాకిస్తాన్ సూపర్- 8 అవకాశాలను కఠినమైయ్యాయి.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!
-
EXPLAINER: పెట్రోల్, ఇథనాల్లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
-
NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుకు సంబంధం ఉందా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?