Bhatti Vikramarka: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్.. నేటి నుంచే అమలు
- రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం
- ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం విద్యా శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అవార్డులు ప్రదానం చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యను, గురువులను గౌరవించేది కాంగ్రెస్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామన్నారు. మరో 6 వేల ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.
Read Also: Shabbir Ali: ఇండోర్ స్టేడియం నిర్మాణానికి షబ్బీర్ అలీ శంకుస్థాపన
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
ఈ సందర్భంగా రాష్ట్రంలోని 27, 862 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ఇవాల్టి నుండే అమలు చేస్తున్నామని.. జీవో కూడా విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు , ఎమ్మెల్యేలు కోదండరాం, నర్సిరెడ్డి, రఘోత్తం రెడ్డి , ఏవీఎన్ రెడ్డి, ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, కమిషనర్లు దేవసేన , శృతి ఓజా , ఈవీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!