Jammu Kashmir: లష్కరే ఉగ్రవాదిగా మారిన గవర్నమెంట్ టీచర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher Arrested For Blasts In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారి బాంబు దాడులకు తెగబడ్డాడు. తాజాగా ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో ఒకదానితో సహా పలు పేలుళ్లకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మారిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ గురువారం తెలిపారు. రియాసి జిల్లాకు చెందిన ఆరిఫ్ అనే వ్యక్తి టీచర్ గా పనిచేస్తూ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాడు. జమ్మూలోని నర్వాల్ లో ఇటీవల జరిగిన జంట పేలుళ్ల కేసులో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Pakistan: పెషావర్ మసీదు పేలుడు.. అందుకే తనిఖీ చేయలేదంటున్న పాక్ అధికారులు..
Also Read
పెర్ఫ్యూమ్ బాటిళ్లలో అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)లను పోలీసులు అతడిని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆరిఫ్, పాకిస్తానీ హ్యాండ్లర్ ఇచ్చే ఆదేశాలతో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదానికి పాల్పడుతున్నాడు. గతంలో వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసి నలుగురి మృతికి కారణం అయ్యాడు. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. ఈ సంఘటనతో తన ప్రమేయం ఉన్నట్లు ఆరిఫ్ పోలీసుల ముందు అంగీకరించాడు. 2022 ఫిబ్రవరిలో జమ్మూలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో జరిగిన ఐఈడీ పేలుడులో, జనవరి 21న నర్వాల్ లో జరిగిన జంట పేలుళ్లలో ఇతనికి సంబంధం ఉంది. పేలుడుకు ఉపయోగించిన ఐఈడీలు అన్ని పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ లోకి వచ్చినట్లు తేలింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?