AP Crime: రాజకీయ వైరం..! మరో కార్యకర్త దారుణ హత్య
AP Crime: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది.. మరోవైపు ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.. ఇక, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చింతలాయ పల్లె గ్రామంలో టీడీపీ కార్యకర్త మంజుల నాగేంద్ర అనే 40 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి గ్రామ సమీపంలోని గంగమ్మ రహదారి మార్గం నుండి వస్తున్న నాగేంద్రపై ప్రత్యర్ధులు ఇనుప సుత్తి, కర్రలు, బండరాళ్లలో దాడిచేశారు.. దారుణంగా కొట్టి హత్య చేశారు.
Read Also: Khalistan: గోల్డెన్ టెంపుల్లో ఖలిస్తానీ నినాదాలు.. భింద్రన్వాలే పోస్టర్ల ప్రదర్శన..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
పోలీసు రికార్డుల్లో ఫ్యాక్షన్ సమస్యాత్మక గ్రామంగా ఉన్న చింతలాయ పల్లెలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంటుంది. గత 2019 ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజుల్లోనే టీడీపీ నాయకుడు మంజుల సుబ్బారావును వైసీపీకి చెందిన ప్రత్యర్థులు బెలుంగుహల వద్ద బండరాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ ఏడాది ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడగానే అదే గ్రామంలో మరో టీడీపీ కార్యకర్త దారుణ హత్య ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 2019లో హత్య గురైన మంజుల సుబ్బారావుకు బంధువైన.. మంజుల నాగేంద్ర ప్రస్తుతం హత్యకు గురయ్యాడు.. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన నాగేంద్రను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, తలకు బలమైన గాయాలు కావడం.. తీవ్ర రక్త స్రావం కావడంతో బాధితుడు నాగేంద్ర కోలుకోలేక మృతి చెందాడు. అయితే, ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించనట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
-
Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!