High Tension in Palnadu: పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న అరెస్టులు..
High Tension in Palnadu: పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఘర్షణలలో దాడులకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న పల్నాడు జిల్లాలో 60 మందికి పైగా అరెస్ట్ చేశారు. సిట్ టీమ్ దర్యాప్తు నేపథ్యంలో మరో 13 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. నిన్న దాచేపల్లి, తంగెడలాంటి ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్న 33 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. టీడీపీకి చెందిన 11 మంది నిందితులను గుంటూరు జైలుకు తరలించగా.. వైసీపీకి చెందిన 22 మందిని నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
Read Also: NTR : ఎన్టీఆర్ ప్లాప్ సినిమాని రీమేక్ చేస్తానంటున్న విశ్వక్ సేన్..
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ఇక, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను టీడీపీ- వైసీపీ నేతలు ధ్వసం చేశారు.. దీంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. కాగా, పల్నాడులో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై స్థానిక సీసీ టీవీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్ట్లు జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పల్నాడులో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ రోజు సైతం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా 15 రోజుల పాటు పోలీస్ భద్రత కొనసాగనుందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!