Kakarla Suresh: ముస్లిం సోదరులకు కాకర్ల సురేష్ రంజాన్ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakarla Suresh: ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్కు అల్లా ఆశీస్సులు ఉండాలని ముస్లిం సోదరులు మాసాయిపేట మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని దీక్ష భూనిన ముస్లిం సోదరులతో కలిసి ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ బుధవారం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులు కాకర్ల సురేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మాసాయిపేట మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. రంజాన్పర్వదినాన్ని పురస్కరించుకొని దీక్ష చేస్తున్న వారందరూ విజయవంతంగా దీక్షను పూర్తి చేయాలన్నారు. అల్లా వారి కోర్కెలను నెరవేర్చాలని ప్రార్థించారు. ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి జోత్స్న, మండల కన్వీనర్ బయన్న, స్థానిక ముస్లిం సోదరులు, సోదరీమణులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
ఉదయగిరి పట్టణంలో బుధవారం సాయంత్రం పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పట్టణంలో ప్రధాన రహదారి వెంబడి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి దుకాణదారుడి వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. టిఫిన్ సెంటర్ వద్ద బోండాలను వేసి అబ్బురపరిచారు. షాప్ యజమానులతో మమేకమై వారి బాధలు తెలుసుకుని టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోత్స్న మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకులు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్లు అని ఆమె తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు టీడీపీ అధినేత చంద్రబాబు అని పేర్కొన్నారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అని, ఆయనను ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
అదేవిధంగా అలుపెరుగని పోరాట యోధుడు నారా లోకేష్ అని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోత్స్న అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అందరి బాధలు తీరుతాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు. తెలుగుదేశం గెలుపు రాష్ట్రానికి మలుపు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కలివెల జ్యోతి, శైలజ అక్కమ్మ, ఆకుల అరుణమ్మ, వెంగళరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?